Political News

చ‌క్రం తిప్పిన టీడీపీ టాప్ లీడ‌ర్‌.. అల్లుడికి ఎంపీ టిక్కెట్ ఫిక్స్‌..!

ఏపీలో ఎన్నిక‌ల డేట్లు వ‌చ్చేశాయి. కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేయ‌డంతో ఎవ‌రికి వారు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. వైసీపీ క్యాండెట్లు మొత్తం ఫిక్స్ అయ్యారు. ఇక టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిలో ఉండ‌డంతో ఈ కూట‌మి పార్టీల త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థులు ఇంకా కొన్ని చోట్ల ఫిక్స్ కావాలి. టీడీపీ ఎంపీ క్యాండెట్ల పేర్ల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా ఉంటే టీడీపీలో ఓ టాప్ లీడ‌ర్ త‌న అల్లుడికి ఎంపీ సీటు కోసం చ‌క్రం తిప్పి దాదాపు స‌క్సెస్ అయ్యార‌న్న ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లో గ‌ట్టిగా న‌డుస్తోంది. ఈ సీనియ‌ర్ నేత ఎవ‌రో కాదు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. య‌న‌మ‌ల ఫ్యామిలీకి ఇప్ప‌టికే రెండు టిక్కెట్లు ద‌క్కాయి.

య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌కు తుని అసెంబ్లీ సీటు కేటాయించారు. ఇక య‌న‌మ‌ల వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు మైదుకూరు సీటు కేటాయించారు. ఇక ఇప్పుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కుమారుడు పుట్టా మ‌హేష్ యాద‌వ్‌కు ఏలూరు పార్ల‌మెంటు సీటు కోసం య‌న‌మ‌ల లాబీయింగ్ స్టార్ట్ అవ్వ‌డంతో పాటు దాదాపు స‌క్సెస్ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలిసింది. యేడాది క్రిత‌మే మ‌హేష్ యాద‌వ్ న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు సీటుపై క‌న్నేసి ఆ పార్ల‌మెంటు ప‌రిధిలో టీడీపీ నేత‌లంద‌రిని క‌లుస్తూ వ‌ర్క్ చేసుకుంటూ వ‌చ్చారు.

అయితే అక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు తేడా వ‌చ్చాయి. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ పార్టీ మార‌తార‌న్న ఊహాగానాలు స్టార్ట్ అవ్వ‌డం.. ఆ సీటు లావుకే టీడీపీ ఇస్తుంద‌న్నది దాదాపు ఖ‌రారు చేసుకున్నాకే మ‌హేష్ సైలెంట్ అయిపోయారు. క‌ట్ చేస్తే ఇప్పుడు వైసీపీ ఏలూరు పార్ల‌మెంటు సీటును యాద‌వ కమ్యూనిటీకే చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కారుమూరి సునీల్‌కుమార్ కు ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ కూడా అదే బీసీ – యాద‌వ క‌మ్యూనిటీ వ్య‌క్తినే దింపే ఆలోచ‌న‌లో ఉంది.

ఈ క్ర‌మంలోనే చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ పేరు ముందుగా వినిపించింది. అయితే ఇప్పుడు య‌న‌మ‌ల స్వ‌యంగా రంగంలోకి దిగి రిక‌మెండేష‌న్ చేయ‌డంతో చంద్ర‌బాబు వారం రోజుల క్రిత‌మే మ‌హేష్ యాద‌వ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏలూరు పార్ల‌మెంటు టీడీపీ అభ్య‌ర్థి మ‌హేష్ యాద‌వ్ అయితే ఎలా ఉంటుంద‌ని ఐవీఆర్ఎస్ స‌ర్వేలు జ‌రుగుతున్నాయి.

అటు బ‌ల‌మైన కుటుంబ నేప‌థ్యం, ఇటీ బీసీల్లో యాద‌వ సామాజిక వ‌ర్గం కావ‌డం.. వైసీపీ ఈక్వేష‌న్‌కు ఈక్వ‌ల్‌గా బ్యాలెన్స్ అయ్యేలా ఉండ‌డం.. ఆర్థిక‌, అంగ‌బ‌లాల్లో తిరుగులేక‌పోవ‌డం ఇవ‌న్నీ మ‌హేష్ యాద‌వ్‌కు ఫ్ల‌స్ కానున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా మ‌హేష్ యాద‌వ్‌కు ఎంపీ టిక్కెట్ ల‌క్ చిక్కుతుందో ? లేదో ? చూడాలి.

This post was last modified on March 19, 2024 11:54 am

Share

Recent Posts

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…

14 minutes ago

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

6 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

7 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

7 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

8 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

8 hours ago