Political News

ఈసారి తెలంగాణ‌కే ప‌రిమితం.. కేసీఆర్ నిర్ణ‌యం

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. తాజాగా ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో ఆయ‌న పార్టీ కీల‌క నేత‌లు, పార్ల‌మెంటు స‌భ్యుల‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు మాసాలుగా ఇంటి నుంచి బ‌య‌ట కు రాని కేసీఆర్‌.. పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం.. మ‌రికొద్ది రోజుల్లోనే ఎన్నిక‌ల‌నోటిఫికేష‌న్ వ‌చ్చేందుకు రంగం కూడా రెడీ అవుతున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఏవిధంగా పోరు సాగిద్దామ‌నే విష‌యంపై ఆయ‌న తాజాగా ఈ భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో కేటీఆర్‌, హ‌రీష్‌రావు, నామా నాగేశ్వ‌ర‌రావు, క‌విత త‌దితర ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలుపుంజుకున్న నేప‌థ్యంలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందు కు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కేసీఆర్ చ‌ర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉచిత బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చిన నేప‌థ్యంలో మ‌హిళా ఓటు బ్యాంకు ప‌రిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కేడ‌ర్ ప‌రిస్థితి, క్షేత్ర‌స్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ అనుకూల‌.. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీని కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం చేయాల‌ని నిర్ణ‌యించారు.

వాస్త‌వానికి వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టి.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై యుద్ధం చేయాల‌ని కేసీఆర్ భావించారు. అయితే.. తెలంగాణ‌లో ఓడిపోవ‌డం..త‌న‌కు అనారోగ్యం.. కేంద్రంలో బీజేపీ బ‌లంగా ఉండ‌డం వంటి ప‌లు కార‌ణాల‌తో కేసీఆర్ ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కావాల‌ని.. 16(1ఎంఐఎం) పార్ల‌మెంటు స్థానాల్లో క‌నీసం 12 నుంచి 15 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాలు ఉండాల‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలిసింది. అవ‌స‌ర‌మైతే.. మ‌రిన్ని ప‌థ‌కాలుప్ర‌క‌టించ‌డం ద్వారా.. మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేదిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు.

రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు జోష్‌లో ఉండడం, జాతీయ విధానాలపై జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అంశాలతో ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపై చర్చకు వచ్చింది. ప్ర‌ధానంగా రామమందిర ఎఫెక్ట్ బీజేపీకి ఏ విధంగా క‌లిసి వ‌స్తుంది..? దీనిని రాష్ట్రంలో ఎలా ఎదుర్కొనాల‌నే విష‌యాల‌పైనా కేసీఆర్ దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 26, 2024 7:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago