దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సినీ నటుడిగానే కాకుండా..రాజకీయ నాయకుడిగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. బీజేపీ తరఫున ఎంపీగా కూడా రెబల్ స్టార్ పనిచేశారు. దీంతో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్య శ్యామలాదేవి కొనసాగిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున 2024 ఎన్నికలలో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి శ్యామలా దేవీ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ అరంగేట్రంపై శ్యామలాదేవి కీలక ప్రకటన చేశారు.
కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ నిర్వహణను దగ్గరుండి చూసుకున్న శ్యామలాదేవి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను కృష్ణంరాజు జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ లపై ఫోకస్ చేశానని, అవి విజయవంతంగా పూర్తయ్యాక రాజకీయాలపై స్పందిస్తానని అన్నారు. నర్సాపురం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృష్ణంరాజు ఎంతగానో పాటుపడ్డారని, పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల కోసం తనవంతు కృషి చేశారని వెల్లడించారు.ప్రస్తుతం సేవా కార్యక్రమాలపైనే తన దృష్టి మొత్తం కేంద్రీకరించానని చెప్పారు.
This post was last modified on January 20, 2024 4:26 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…