విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరో ముండనం ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత, నటుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిమానేసిన శ్రీకాంత్ ఫోన్ దొంగతనం చేశాడంటూ నూతన్ తో పాటు అతడి కుటుంబసభ్యులు శ్రీకాంత్ పై దాడి చేసి గుండు కొట్టించడం సంచలనం రేపింది. నూతన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నూతన్ నాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన ఏపీ పోలీసులు తాజాగా శుక్రవారం నాడు అతడిని కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టు చేశారు. ముంబైలో తలదాచుకునేందుకు నూతన్ వెళుతున్న క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తర్వాతే అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
కాగా, శ్రీకాంత్ శిరోముండన ఘటన ఏపీలో సంచలనం రేపింది. ఘటన జరిగిన తర్వాత శ్రీకాంత్ను మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అవంతి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాంత్ కు వ్యక్తిగతంగా రూ.50 వేల నగదును ఎమ్మెల్యే అదీప్ రాజ్ అందజేశారు. శ్రీకాంత్ శిరోముండనం ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
This post was last modified on September 4, 2020 7:29 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…