Political News

కర్ణాటకలో పట్టుబడ్డ నూతన్ నాయుడు…అరెస్ట్

విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరో ముండనం ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత, నటుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిమానేసిన శ్రీకాంత్ ఫోన్ దొంగతనం చేశాడంటూ నూతన్ తో పాటు అతడి కుటుంబసభ్యులు శ్రీకాంత్ పై దాడి చేసి గుండు కొట్టించడం సంచలనం రేపింది. నూతన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య మధుప్రియ సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నూతన్ నాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన ఏపీ పోలీసులు తాజాగా శుక్రవారం నాడు అతడిని కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టు చేశారు. ముంబైలో తలదాచుకునేందుకు నూతన్ వెళుతున్న క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తర్వాతే అతడిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

కాగా, శ్రీకాంత్ శిరోముండన ఘటన ఏపీలో సంచలనం రేపింది. ఘటన జరిగిన తర్వాత శ్రీకాంత్‌ను మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అవంతి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాంత్ కు వ్యక్తిగతంగా రూ.50 వేల నగదును ఎమ్మెల్యే అదీప్ రాజ్ అందజేశారు. శ్రీకాంత్ శిరోముండనం ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

This post was last modified on September 4, 2020 7:29 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

2 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

3 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

4 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

5 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

6 hours ago