Political News

చంద్ర‌బాబుకు బంగారు ప‌ళ్లెంలో పెట్టి..

టీడీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంపై పేటెంట్ త‌న‌దేన‌ని అన్నారు. ఇక్క‌డ ఎవ‌రికీ స్థానం లేద‌న్నారు. తానే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశాన‌ని చెప్పుకొంటాన‌ని, ఈ దైర్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం గ‌త నాలుగు రోజులుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని వాడ వాడ‌లా తిరుగుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయిలో రంగం రెడీ చేసుకుంటున్నారు. బాబు ష్యూరిటీ.. భ‌విష్య‌త్తు కు గ్యారెంటీ పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తు న్నారు. ‘‘దెందులూరులో నా చెమట, నా రక్తం, మీ కష్టం అన్నీ ఉన్నాయిఅని చింత‌మేనేని అన్నారు. వీటన్నింటిని కలబోసి రాజకీయం చేస్తున్నాన‌ని చెప్పారు.ఎవడుపడితే వాడు, ఎక్కడపడితే అక్కడ నాలుగు రూపాయలున్నాయి కదా అని బ్యాగులేసుకొస్తే వెంట్రుక కూడా పీకలేరు“ అని నిప్పులు చెరిగారు.

నాయకుడు అనే వాడు ప్రజల్లో నుంచే పుడతాడన్న చింత‌మ‌నేని.. తాను అలానే ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన మాస్ లీడ‌ర్‌న‌ని చెప్పుకొచ్చారు. దెందులూరు ప్ర‌జ‌లు అమాయ‌కులు కాద‌ని, ఇక్క‌డ ఎవ‌రిని గెలిపించాలో వారికి బాగా తెలుసున‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని.., చంద్ర‌బాబుకు బంగారు ప‌ళ్లెంలో పెట్టి ఈ విజ‌యాన్ని కానుక‌గా అందిస్తాన‌ని చింత‌మ‌నేని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే.. 2014లో విజ‌యం ద‌క్కించుకున్న చింత‌మ‌నేని అనేక వివాదాల్లో కూరుకుపోయారు. అయిన‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున ఎన్నారై.. అబ్బ‌య్య చౌద‌రి ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఈయ‌న‌ను మార్చే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనేచింత‌మ‌నేని మ‌రింత దూకుడు పెంచార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.

This post was last modified on January 10, 2024 6:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chintamaneni

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago