Political News

చంద్ర‌బాబుకు బంగారు ప‌ళ్లెంలో పెట్టి..

టీడీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంపై పేటెంట్ త‌న‌దేన‌ని అన్నారు. ఇక్క‌డ ఎవ‌రికీ స్థానం లేద‌న్నారు. తానే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశాన‌ని చెప్పుకొంటాన‌ని, ఈ దైర్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం గ‌త నాలుగు రోజులుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని వాడ వాడ‌లా తిరుగుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయిలో రంగం రెడీ చేసుకుంటున్నారు. బాబు ష్యూరిటీ.. భ‌విష్య‌త్తు కు గ్యారెంటీ పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తు న్నారు. ‘‘దెందులూరులో నా చెమట, నా రక్తం, మీ కష్టం అన్నీ ఉన్నాయిఅని చింత‌మేనేని అన్నారు. వీటన్నింటిని కలబోసి రాజకీయం చేస్తున్నాన‌ని చెప్పారు.ఎవడుపడితే వాడు, ఎక్కడపడితే అక్కడ నాలుగు రూపాయలున్నాయి కదా అని బ్యాగులేసుకొస్తే వెంట్రుక కూడా పీకలేరు“ అని నిప్పులు చెరిగారు.

నాయకుడు అనే వాడు ప్రజల్లో నుంచే పుడతాడన్న చింత‌మ‌నేని.. తాను అలానే ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన మాస్ లీడ‌ర్‌న‌ని చెప్పుకొచ్చారు. దెందులూరు ప్ర‌జ‌లు అమాయ‌కులు కాద‌ని, ఇక్క‌డ ఎవ‌రిని గెలిపించాలో వారికి బాగా తెలుసున‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని.., చంద్ర‌బాబుకు బంగారు ప‌ళ్లెంలో పెట్టి ఈ విజ‌యాన్ని కానుక‌గా అందిస్తాన‌ని చింత‌మ‌నేని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే.. 2014లో విజ‌యం ద‌క్కించుకున్న చింత‌మ‌నేని అనేక వివాదాల్లో కూరుకుపోయారు. అయిన‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున ఎన్నారై.. అబ్బ‌య్య చౌద‌రి ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఈయ‌న‌ను మార్చే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనేచింత‌మ‌నేని మ‌రింత దూకుడు పెంచార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.

This post was last modified on January 10, 2024 6:32 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

22 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

37 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

37 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago