Political News

అన్నావారి అల‌క‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్నార‌ట‌!

గిద్ద‌లూరు వైసీపీ ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన అన్నా రాంబాబు.. అల‌క బూనారు. ఒక్క రోజులో ఆయ‌న మాట మార్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గిద్ద‌లూరు నుంచి పోటీ చేసిన అన్నా.. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న రెండో నాయ‌కుడిగా పేరు తెచ్చుక‌న్నారు. అయితే.. ఆయ‌న దూకుడు స్వ‌భావ‌మే.. ఆయ‌న‌ను నాయ‌కుల‌కు దూరం చేసింది. మితి మీరిన అహంకారం కూడా ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులే చెప్పుకొనే ప‌రిస్థితికి వ‌చ్చారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వారు ఉద్య‌మాలు నిర్వ‌హించారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే వైసీపీ రెండేళ్ల కింద‌టే అలెర్ట్ అయింది. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని సూచించింది. అయినా.. అన్నా ఎదురు దాడికి దిగార‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఇదిలావుంటే, 2022లో జ‌రిగిన మంత్రి వ‌ర్గం రెండో సారి విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని ఆరోపిస్తూ.. రోడ్డెక్కారు. పార్టీపై నింద‌లేశారు. మ‌రోవైపు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిఖార్సుగా చేయాల‌ని పార్టీ పిలుపునిస్తే.. మొక్కుబ‌డిగా చేశార‌నే నివేదిక‌లు కూడా అందాయి. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామాల‌ను జీర్ణించుకోలేక పోయారో.. లేక వైసీపీపై వ్య‌తిరేక‌త పెంచుకున్నారో తెలియ‌దు కానీ, మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. ప్ర‌కాశం జిల్లా నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే తొలి నాయ‌కుడు తానేన‌ని కూడా చెప్పేశారు. అయితే.. టీడీపీలో గ‌తంలో ఆయ‌న చేసిన యాగీ అంతా ఇంతా కాదు. పార్టీ అధినేత‌కు స‌మాంతరంగా ఆయ‌న పావులు క‌దిపి నిత్యం వివాదాలు కొని తెచ్చుకున్నారు. దీంతో ఆపార్టీ ఆయ‌న‌ను అప్ప‌ట్లో స‌స్పెండ్ చేసే ప‌రిస్థితి వ‌చ్చింది.

మ‌ళ్లీ ఇప్పుడు పోయి పోయి.. నిప్పుల కుంప‌టిని తెచ్చుకునే ఉద్దేశం టీడీపీకి లేదు. అన్నా పార్టీలోకి వ‌స్తాన‌ని చెప్పినా.. టీడీపీ నుంచి సానుకూల ప‌రిణామాలు క‌నిపించ‌లేదు. దీంతో 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అన్నా మాట మార్చేశారు. తాను రాజ‌కీయాల‌కు దూరం అవుతాన‌ని.. వైసీపీ టికెట్ ఎవ‌రికి ఇచ్చినా.. త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని.. చెప్పుకొచ్చారు. సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కూడా గుప్పించారు. అంతేకాదు.. పార్టీ నాయ‌కులు ఐక్యంగా ముందుకు సాగాల‌ని.. ప‌ద‌వులు పొందిన పార్టీని గెలిపించుకోవాల‌ని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. అన్నావారి అల‌క తీర‌క‌పోయే స‌రికి.. ఇత‌ర పార్టీల్లోనూ ఆయ‌నకు దారులు మూసుకుపోయే స‌రికి.. వ్యూహాత్మ‌కంగా మాట మార్చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 27, 2023 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

22 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

28 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

59 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago