Political News

మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో భేటీ కావ‌డం.. సుమారు 4 గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం తెలిసిందే. ఈ ప‌రిణామంపై వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇండియా కూట‌మిలో చంద్ర‌బాబును చేర్పించుకునేందుకే ప్ర‌శాంత్ కిషోర్ చ‌ర్చ‌లు జ‌రిపాడని అన్నారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా… సీఎం జగన్ ను పీకేదెం ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అన్నారు.

సీఎం జగన్, మేము రోజు చెబుతూనే ఉన్నాం..ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చిన‌ ప్రశాంత్ కిషోర్‌ను `ఏం పికుతాడు తమ్ముళ్లు` అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలి అని కొడాలి నిల‌దీశారు.

పీకే సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని, మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకోడానికి, లోకేష్ త‌న‌ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? అని కొడాలి ప్ర‌శ్నించారు. ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదన్నారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని చెప్పారు.

పార్ట‌న‌ర్‌ పీకే(ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే(ప్ర‌శాంత్ కిషోర్‌) ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడని కొడాలి చెప్పారు. చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on December 24, 2023 3:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

12 hours ago