టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడం.. సుమారు 4 గంటల పాటు చర్చలు జరపడం తెలిసిందే. ఈ పరిణామంపై వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇండియా కూటమిలో చంద్రబాబును చేర్పించుకునేందుకే ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపాడని అన్నారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా… సీఎం జగన్ ను పీకేదెం ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అన్నారు.
సీఎం జగన్, మేము రోజు చెబుతూనే ఉన్నాం..ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చిన ప్రశాంత్ కిషోర్ను `ఏం పికుతాడు తమ్ముళ్లు` అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలి అని కొడాలి నిలదీశారు.
పీకే సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని, మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకోడానికి, లోకేష్ తన తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? అని కొడాలి ప్రశ్నించారు. ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదన్నారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని చెప్పారు.
పార్టనర్ పీకే(పవన్ కళ్యాణ్) బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే(ప్రశాంత్ కిషోర్) ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడని కొడాలి చెప్పారు. చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on December 24, 2023 3:06 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…