Political News

శ్వేత‌ప‌త్రం వ‌ర్సెస్ స్వేద ప‌త్రం.. కేటీఆర్ ఆక్రోశం ఇదే!

తెలంగాణ రాజ‌కీయాల్లో శ్వేత ప‌త్రం వ‌ర్సెస్ స్వేద‌ప‌త్రం కాక రేపుతోంది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అయిన కాడికి అప్పులు చేసి.. మిగులు రాష్ట్రాలు త‌గులు రాష్ట్రంగా మార్చిందంటూ.. ఇటీవ‌ల అసెంబ్లీలో కాంగ్రెస్ స‌ర్కారు శ్వేత ప‌త్రం విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అటు అధికార‌, ఇటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో త‌మ స‌ర్కారు ఏం చేసిందో స్వేద ప‌త్రం విడుద‌ల చేస్తామ‌ని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ స్వేద పత్రం విడుదల చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందని మండిపడ్డా రు. శ్వేత పత్రాలు అని హడావుడి చేసి సభను వాయిదా వేసుకుని పారి పోయారని విమర్శించారు.

గతంలో ఏం జరిగిందో చెప్పవలసిన భాధ్యత తమపై ఉందన్న కేటీఆర్ బీఆర్ ఎస్ పాల‌న‌లోనే రాష్ట్రం అభివృద్ధి సాధించింద‌ని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, ఉద్యోగులు చెమటోడ్చి చేసిన కృషి ప్రజలకు తెలియాలన్నారు. విద్వంసం నుంచి వికాసం వైపు జరిగిన ప్రగతి ప్రస్థానం బీఆర్ ఎస్ తోనే సాధ్య‌మైంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రం వెనుక‌బ‌డి పోయింద‌ని వివ‌రించారు. త‌ల‌స‌రి ఆదాయం నుంచి విద్యుత్ వినియోగం వ‌ర‌కు.. అన్ని రంగాలూ వెనుక‌బ‌డ్డాయ‌ని తెలిపారు.

కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌ను అగ్ర‌గాఇగా నిల‌బెట్టింద‌ని వివ‌రించారు. కాంగ్రెస్ పాల‌న‌లో కంట త‌డి పెట్ట‌ని ప్ర‌జ‌లు లేర‌ని అన్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు కాంగ్రెస్ హ‌యాంలోనే జ‌రిగాయ‌న్నారు. క‌ల్లోల ప‌రిస్థితులు, పోలీసుల కాల్పులు, క‌రువు, కాట‌కాలు.. వారి హ‌యాంపై చెర‌గ‌నిముద్ర వేశాయ‌న్నారు. అయితే.. వాట‌న్నింటినీ తోసిరాజ‌ని కేసీఆర్ బంగారు తెలంగాణ‌ను సాకారం చేశార‌ని కేటీఆర్ వివ‌రించారు.

This post was last modified on December 24, 2023 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago