2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఆ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ రెండు ఘటనలలోనూ కామన్ ఫ్యాక్టర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.
ఎందుకంటే ఆనాడు సీఎం జగన్ కు, మమతా బెనర్జీకి ఎన్నికల, రాజకీయ వ్యూహకర్తగా ఉన్నది పీకే. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలపై దాడులు జరుగుతున్న వైనం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీకే రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాలలో ఇటువంటి కుట్రలు సాధారణమని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గువ్వల బాలరాజు, ప్రభాకర్ రెడ్డిలపై దాడి ఇటువంటి కుట్రల్లో భాగమని ఆరోపించారు.
సంచలనం కోసమే ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగిందని పోలీసులు చెప్పారని, ఆ నిందితుడిని ఇంతవరకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదని రేవంత్ గుర్తు చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలని, రిమాండ్ రిపోర్ట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, మరో మూడు కుట్రలు జరుగుతాయని కేసీఆర్ కూడా చెబుతున్నారని, ముందుగానే కుట్రల గురించి ఆయనకు ఎలా తెలుసు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, అయినా ఎన్నికల సంఘం మౌనంగా ఉందని ఆక్షేపించారు. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.
This post was last modified on November 14, 2023 6:20 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…