టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసిన 73 ఏళ్ల వయస్సున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు. ఇక, చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం సబబేనని కేటీఆర్ అన్నారు.
గతంలో తాము టిడిపిని విమర్శించడం వాస్తవమేనని, అయితే 2018లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఆ కోణంలోనే తాము టీడీపీపై విమర్శలు గుప్పించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని 2023 ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడం లేదు కాబట్టి ఆ పార్టీపై విమర్శలకు తావేలేదని కేటీఆర్ చెప్పారు. ఇక, భారత క్రికెట్ జట్టుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లింకు పెట్టి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని, అదేవిధంగా తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కేటీఆర్ అన్నారు. టీమిండియా, కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని జోస్యం చెప్పారు.
ఎన్నికల రేసులో బిజెపి లేదని, కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు ,అంధకారం, మత కలహాలు, అరాచకం తప్పవని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అంగీకరించారు. కానీ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు 90 శాతం మంది ప్రజలకు అందించామని, మెజార్టీ ప్రజలు తమతోనే ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on November 4, 2023 5:14 pm
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…
అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…
టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…
తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, రచ్చకు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈయన తమిళనాడుకు ఇంచార్జ్ గవర్నర్గా…