Political News

సీపీఐ కూడా గెడ్ బై చెప్పేస్తుందా ?

కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఐ కూడా గుడ్ బై చెప్పేస్తుందా ? రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐకి పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఎం అడిగిన రెండుసీట్లు వైరా లేదా పాలేరు, మిర్యాలగూడెం సీట్లపైనే వివాదం కంటిన్యు అవుతోంది. ఎన్నిరోజులైనా పొత్తును కాంగ్రెస్ ఫైనల్ చేయకపోవటంతో పాటు గతంలో ఇస్తామని ప్రతిపాదించిన సీట్లపైన కూడా తాజాగా వెనక్కు తగ్గిందని సీపీఎం ఆరోపించింది.

కాంగ్రెస్ వైఖరి నచ్చకపోవటంతో పొత్తును తెంచుకున్నట్లు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. అలాగే తమ పార్టీ పోటీచేయబోయే 17 నియోజకవర్గాల జాబితాను కూడా ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీపీఐ నిర్ణయంతో తమకు సంబంధంలేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తుంటే సీపీఐ పోటీచేయబోయే రెండుసీట్లలో తమ పార్టీ పోటీచేయదని కూడా చెప్పారు. అయితే సీపీఎం నిర్ణయం నేపధ్యంలో సీపీఐ కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ తో పొత్తుంటే రెండుపార్టీలూ ఉండాలని లేకపోతే రెండుపార్టీలు విడిగానే పోటీచేయాలనే ఆలోచనలో సీపీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు లేకపోతే రెండు పార్టీలు ఐక్యంగా పోటీచేస్తాయనటంలో సందేహంలేదు. ఇప్పటికే సీపీఎం పార్టీ 17 నియోజకవర్గాలను ప్రకటించేసింది. కాబట్టి కాంగ్రెస్ తో పొత్తులేకపోతే సీపీఐ కూడా ఓ 15 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు శుక్రవారం సమావేశం పెట్టుకున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సొంతంగా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచేంత సీన్ కమ్యూనిస్టు పార్టీలకు లేదు. అయితే గెలుస్తారని అనుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో ఒకరిని ఓడగొట్టేందుకు మాత్రం పనికొస్తాయి. అందుకనే కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కాకపోతే సీట్లపంపకాల్లో తేడా రావటంతోనే ఏ విషయం తేల్చుకోలేకపోతోంది. మరి ఈ విషయాన్ని ఎంత తొందరగా కాంగ్రెస్ తేల్చుకుంటే అంతమంచిది.

This post was last modified on November 3, 2023 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

34 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago