Political News

ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుకు విజయ దశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పండుగను ఆనందంగా జరుపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.

తాను జైలులో లేనని, ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. ప్రజ‌ల నుంచి తనను ఎవ్వరూ దూరం చేయ‌లేరని, 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ను ఎవరూ చెరపలేరని అన్నారు. ఆల‌స్యమైనా న్యాయానిదే అంతిమ విజయమని, త్వర‌లో బ‌య‌టికొచ్చి ప్రజ‌ల కోసం, రాష్ట్ర ప్రగ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తానని చెప్పారు. ఓట‌మి భయంతో తనను జైలులో పెట్టారని, ప్రజ‌ల మ‌ధ్యలో లేక‌పోయినా అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా క‌నిపిస్తానని చెప్పారు.

45 ఏళ్ల ప్రజా జీవితం తన క‌ళ్ల ముందు కదలాడుతోందని, తన రాజ‌కీయ ప్రస్థాన‌మంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగిందని అన్నారు. కుట్రల‌తో తనపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్రయ‌త్నించారని, తాను న‌మ్మిన విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ను ఎన్నడూ చెరిపేయ‌లేరు. ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మినని, సూర్యుడి ముందు కారుమ‌బ్బులు వీడిపోతాయని, సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించ లేవని చెప్పారు. జైలు గోడ‌లు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని, జైలు ఊచ‌లు ప్రజ‌ల నుంచి దూరం చేయ‌లేవని అన్నారు.

ఈ దసరాకు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజ‌మ‌హేంద్రవ‌రం మహానాడులో ప్రకటించానని, అదే రాజ‌మ‌హేంద్రవ‌రం జైలులో తనను ఖైదు చేశారని చెప్పారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తానని అన్నారు.

This post was last modified on October 23, 2023 12:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago