ఈ వారాంతంలో భారీ హైప్ మధ్య రిలీజైన ‘లియో’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ సినిమా గురించి ఏదో ఊహించుకుంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంకేదో చూపించాడు. సినిమా ఆరంభం నుంచి ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది ప్రేక్షకులు ఎదురు చూడటం.. చివరికి ఏమీ లేకుండానే సినిమా ముగిసిపోవడం జరిగింది. వర్తమానంలో పార్తిబన్ కథ ఎంత సాధారణంగా నడిచినా.. కనీసం ఫ్లాష్ బ్యాక్లో అయినా లియో దాస్ పాత్రతో కిక్ ఇస్తారని ఆశిస్తే.. అది కూడా నిరాశ పరుస్తుంది.
లియో పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్కు తగ్గట్లుగా ఫ్లాష్ బ్యాక్ లేకపోయింది. నరబలి నేపథ్యంలో నడిచిన ఫ్లాష్ బ్యాక్ తుస్సుమనిపించేసింది. దీనికేనా అంత బిల్డప్ అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్. ఐతే ఈ ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘లియో’కు అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ అంతా నిజం అనుకోవడానికి లేదు అని మాట్లాడాడు. అదంతా కూడా అబద్ధం అయ్యుండొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించాడు.
జైల్లో ఖైదీగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఒక కట్టుకథను గౌతమ్ మీనన్కు చెప్పి ఉండొచ్చనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. అంటే మనం సినిమాలో చూసిందంతా అబద్ధం.. దీనికి కొనసాగింపుగా విజయ్తో తర్వాత తీసే సినిమాలో అసలు నిజం చూపిస్తారని ‘లియో’ టీం వర్గాలు అంటున్నాయి. ఐతే అదంతా అబద్ధం అయితే.. ‘లియో’లోనే ఆ విషయం చెప్పకుండా ఇంకో పార్ట్ అనడం విడ్డూరంగా ఉంది. మరి ఈ సినిమా చూసిన జనం పిచ్చోళ్లు అనుకోవాలా? అసలే అది పేలవమైన ఫ్లాష్ బ్యాక్ అంటే.. అదంతా అబద్ధం అని సినిమాలో కాకుండా బయట చెప్పడం అంటే ఆడియన్స్ను ఫూల్స్ను చేయడం కాక మరేంటి?
This post was last modified on October 22, 2023 4:02 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…