ఈ వారాంతంలో భారీ హైప్ మధ్య రిలీజైన ‘లియో’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ సినిమా గురించి ఏదో ఊహించుకుంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంకేదో చూపించాడు. సినిమా ఆరంభం నుంచి ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది ప్రేక్షకులు ఎదురు చూడటం.. చివరికి ఏమీ లేకుండానే సినిమా ముగిసిపోవడం జరిగింది. వర్తమానంలో పార్తిబన్ కథ ఎంత సాధారణంగా నడిచినా.. కనీసం ఫ్లాష్ బ్యాక్లో అయినా లియో దాస్ పాత్రతో కిక్ ఇస్తారని ఆశిస్తే.. అది కూడా నిరాశ పరుస్తుంది.
లియో పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్కు తగ్గట్లుగా ఫ్లాష్ బ్యాక్ లేకపోయింది. నరబలి నేపథ్యంలో నడిచిన ఫ్లాష్ బ్యాక్ తుస్సుమనిపించేసింది. దీనికేనా అంత బిల్డప్ అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్. ఐతే ఈ ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘లియో’కు అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ అంతా నిజం అనుకోవడానికి లేదు అని మాట్లాడాడు. అదంతా కూడా అబద్ధం అయ్యుండొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించాడు.
జైల్లో ఖైదీగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఒక కట్టుకథను గౌతమ్ మీనన్కు చెప్పి ఉండొచ్చనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. అంటే మనం సినిమాలో చూసిందంతా అబద్ధం.. దీనికి కొనసాగింపుగా విజయ్తో తర్వాత తీసే సినిమాలో అసలు నిజం చూపిస్తారని ‘లియో’ టీం వర్గాలు అంటున్నాయి. ఐతే అదంతా అబద్ధం అయితే.. ‘లియో’లోనే ఆ విషయం చెప్పకుండా ఇంకో పార్ట్ అనడం విడ్డూరంగా ఉంది. మరి ఈ సినిమా చూసిన జనం పిచ్చోళ్లు అనుకోవాలా? అసలే అది పేలవమైన ఫ్లాష్ బ్యాక్ అంటే.. అదంతా అబద్ధం అని సినిమాలో కాకుండా బయట చెప్పడం అంటే ఆడియన్స్ను ఫూల్స్ను చేయడం కాక మరేంటి?
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…