ఈ వారాంతంలో భారీ హైప్ మధ్య రిలీజైన ‘లియో’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ సినిమా గురించి ఏదో ఊహించుకుంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంకేదో చూపించాడు. సినిమా ఆరంభం నుంచి ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది ప్రేక్షకులు ఎదురు చూడటం.. చివరికి ఏమీ లేకుండానే సినిమా ముగిసిపోవడం జరిగింది. వర్తమానంలో పార్తిబన్ కథ ఎంత సాధారణంగా నడిచినా.. కనీసం ఫ్లాష్ బ్యాక్లో అయినా లియో దాస్ పాత్రతో కిక్ ఇస్తారని ఆశిస్తే.. అది కూడా నిరాశ పరుస్తుంది.
లియో పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్కు తగ్గట్లుగా ఫ్లాష్ బ్యాక్ లేకపోయింది. నరబలి నేపథ్యంలో నడిచిన ఫ్లాష్ బ్యాక్ తుస్సుమనిపించేసింది. దీనికేనా అంత బిల్డప్ అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్. ఐతే ఈ ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘లియో’కు అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ అంతా నిజం అనుకోవడానికి లేదు అని మాట్లాడాడు. అదంతా కూడా అబద్ధం అయ్యుండొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించాడు.
జైల్లో ఖైదీగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఒక కట్టుకథను గౌతమ్ మీనన్కు చెప్పి ఉండొచ్చనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. అంటే మనం సినిమాలో చూసిందంతా అబద్ధం.. దీనికి కొనసాగింపుగా విజయ్తో తర్వాత తీసే సినిమాలో అసలు నిజం చూపిస్తారని ‘లియో’ టీం వర్గాలు అంటున్నాయి. ఐతే అదంతా అబద్ధం అయితే.. ‘లియో’లోనే ఆ విషయం చెప్పకుండా ఇంకో పార్ట్ అనడం విడ్డూరంగా ఉంది. మరి ఈ సినిమా చూసిన జనం పిచ్చోళ్లు అనుకోవాలా? అసలే అది పేలవమైన ఫ్లాష్ బ్యాక్ అంటే.. అదంతా అబద్ధం అని సినిమాలో కాకుండా బయట చెప్పడం అంటే ఆడియన్స్ను ఫూల్స్ను చేయడం కాక మరేంటి?
This post was last modified on October 22, 2023 4:02 pm
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…