ఈ వారాంతంలో భారీ హైప్ మధ్య రిలీజైన ‘లియో’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ సినిమా గురించి ఏదో ఊహించుకుంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంకేదో చూపించాడు. సినిమా ఆరంభం నుంచి ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది ప్రేక్షకులు ఎదురు చూడటం.. చివరికి ఏమీ లేకుండానే సినిమా ముగిసిపోవడం జరిగింది. వర్తమానంలో పార్తిబన్ కథ ఎంత సాధారణంగా నడిచినా.. కనీసం ఫ్లాష్ బ్యాక్లో అయినా లియో దాస్ పాత్రతో కిక్ ఇస్తారని ఆశిస్తే.. అది కూడా నిరాశ పరుస్తుంది.
లియో పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్కు తగ్గట్లుగా ఫ్లాష్ బ్యాక్ లేకపోయింది. నరబలి నేపథ్యంలో నడిచిన ఫ్లాష్ బ్యాక్ తుస్సుమనిపించేసింది. దీనికేనా అంత బిల్డప్ అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్. ఐతే ఈ ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘లియో’కు అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ అంతా నిజం అనుకోవడానికి లేదు అని మాట్లాడాడు. అదంతా కూడా అబద్ధం అయ్యుండొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించాడు.
జైల్లో ఖైదీగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఒక కట్టుకథను గౌతమ్ మీనన్కు చెప్పి ఉండొచ్చనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. అంటే మనం సినిమాలో చూసిందంతా అబద్ధం.. దీనికి కొనసాగింపుగా విజయ్తో తర్వాత తీసే సినిమాలో అసలు నిజం చూపిస్తారని ‘లియో’ టీం వర్గాలు అంటున్నాయి. ఐతే అదంతా అబద్ధం అయితే.. ‘లియో’లోనే ఆ విషయం చెప్పకుండా ఇంకో పార్ట్ అనడం విడ్డూరంగా ఉంది. మరి ఈ సినిమా చూసిన జనం పిచ్చోళ్లు అనుకోవాలా? అసలే అది పేలవమైన ఫ్లాష్ బ్యాక్ అంటే.. అదంతా అబద్ధం అని సినిమాలో కాకుండా బయట చెప్పడం అంటే ఆడియన్స్ను ఫూల్స్ను చేయడం కాక మరేంటి?
This post was last modified on October 22, 2023 4:02 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…