Political News

పశ్చిమ బెంగాల్ వ్యూహం తెలంగాణలో!

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే.. ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయనుందా? కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక అమలు చేయనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దెబ్బ కొట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలో దింపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంపీ అధినేత్రి మమతా బెనర్జీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు పన్నింది. ముఖ్యంగా మమతా బెనర్జీని ఓడిస్తే ఆ పార్టీ స్థైర్యం దెబ్బ తింటుందనే ఆలోచన చేసింది. అందుకే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారిని మమతా బెనర్జీకి పోటీగా నిలబెట్టింది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై సువేందు విజయం సాధించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ హవా కొనసాగడంతో వరుసగా మూడో సారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల లోపు దీదీ మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు.

ఇప్పుడు తెలంగాణలోనూ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేయనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కసరత్తలు చేస్తోంది. అందుకు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ను ప్రయోగించాలని చూస్తోంది. అందుకే ఈటలకు హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ టికెట్ కేటాయించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈటల కూడా అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేస్తానని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ వర్సెస్ ఈటల పోటీ ఖాయమేనని చెప్పాలి. మరి పశ్చిమ బెంగాల్ లాగా ఇక్కడ కూడా బీజేపీ అనుకున్న ఫలితం రాబడుతుందేమో చూడాలి.

This post was last modified on October 22, 2023 8:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago