2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే.. ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయనుందా? కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక అమలు చేయనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దెబ్బ కొట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలో దింపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంపీ అధినేత్రి మమతా బెనర్జీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు పన్నింది. ముఖ్యంగా మమతా బెనర్జీని ఓడిస్తే ఆ పార్టీ స్థైర్యం దెబ్బ తింటుందనే ఆలోచన చేసింది. అందుకే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారిని మమతా బెనర్జీకి పోటీగా నిలబెట్టింది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై సువేందు విజయం సాధించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ హవా కొనసాగడంతో వరుసగా మూడో సారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల లోపు దీదీ మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు.
ఇప్పుడు తెలంగాణలోనూ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేయనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కసరత్తలు చేస్తోంది. అందుకు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ను ప్రయోగించాలని చూస్తోంది. అందుకే ఈటలకు హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ టికెట్ కేటాయించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈటల కూడా అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేస్తానని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ వర్సెస్ ఈటల పోటీ ఖాయమేనని చెప్పాలి. మరి పశ్చిమ బెంగాల్ లాగా ఇక్కడ కూడా బీజేపీ అనుకున్న ఫలితం రాబడుతుందేమో చూడాలి.
This post was last modified on October 22, 2023 8:08 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…