జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పెళ్లిళ్లను టార్గెట్ చేస్తూ జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ ఇల్లు హైదరాబాద్ లో ఉందని, ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు మారిపోతుంటారని ఎద్దేవా చేశారు. ఒకసారి లోకల్..ఒకసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్…మరి తర్వాత ఎక్కడకు పోతాడో..అంటూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థన్నా…ఈ పెద్దమనిషికి ఉన్న గౌరవమేమిటన్నది ఆలోచన చేయాలని జగన్ అన్నారు.
గురువారం సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం బహిరంగ సభలో జగన్ ఈ కామెంట్లు చేశారు.
ప్యాకేజీ స్టార్ ది ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ అని, మన ఇళ్లల్లో అక్క చెల్లెమ్మలను మనం గౌరవించకపోతే..మనం లీడర్లు ఎలా అవుతామని జగన్ ప్రశ్నించారు. ఇళ్లాళ్లను మారుస్తుంటే..ఆడవాళ్ల మీద ఎలాంటి గౌరవం ఉంది అనే విషయం అర్థమవుతోందని అన్నారు. ఈ ప్యాకేజీ స్టార్ కు భీమవరంతో సంబంధం లేదని, గాజువాకతో అనుబంధం లేదని జగన్ విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి పోయే వాళ్లకు మన రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.
పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తూ అభిమానుల ఓట్లను గంపగుత్తగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకోవడానికే షూటింగ్ గ్యాప్ లో రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటాడని పవన్ పై జగన్ సెటైర్లు వేశారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారి పవన్ మాత్రమేనని జగన్ విమర్శించారు.
This post was last modified on October 12, 2023 6:51 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…