Political News

పవన్ పై జగన్ కామెంట్లకు RRR కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కు ఏపీలో ఇల్లు లేదని, భార్యలను మారుస్తుంటారని జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ పై జగన్ వ్యాఖ్యలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. పవన్ పెళ్లిళ్లపై జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆ వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించారు. పవన్ మొన్ననే ఏపీలో ఇల్లు కట్టుకున్నారని రఘురామ అన్నారు. జగన్ లాగా పవన్ దగ్గర డబ్బులు లేవని, నటించి సంపాదిస్తున్నారని జగన్ కు చురకలంటించారు.

పవన్ తన కులాన్ని, కాపులను, తన వారని చెప్పుకోవడం లేదని జగన్ అంటున్నారని, మరి జగన్ ఒక్కసారైనా రెడ్డి అని చెప్పుకున్నారా? అంటూ రఘురామ ప్రశ్నించారు. జగన్‌ కమ్మ, ఓబీసీలను ద్వేషిస్తారని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మి విశాఖలో ఎందుకు పోటీ చేశారని పవన్ అడిగితే జగన్ ఏం సమాధానం చెబుతారని రఘురామ నిలదీశారు. తెలంగాణలో విజయలక్ష్మి పాలేరు, షర్మిల మిర్యాలగూడలో పోటీ చేయొచ్చా అని ప్రశ్నిస్తే ఏం చెబుతారని అన్నారు. జగన్ దొడ్డి దారిన విశాఖ వెళ్తున్నారని, పెద్ద భవనాలు నిర్మించారని అన్నారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి విశాఖకు వెళ్తారా? అని ప్రశ్నించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను లోకేష్ కలిశారని, ఆ సమయంలో పురందేశ్వరి, కిషన్ రెడ్డి ఉన్నారని చెప్పారు. దీంతో, వైసీపీ నేతలు కలవరపాటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి లోకేష్, షాల సమావేశం ఏర్పాటు చేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న కారుకూతలు ఆపాలని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు వెనుక కేంద్రం ఉన్నట్టు జగన్ ప్రచారం చేసుకున్నారని, ఆ కుట్రలో బీజేపీకి భాగం ఉన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడారని చెప్పారు. తనపై కేసు తర్వాత అమిత్ షాను తన కుటుంబ సభ్యులు కలిశారని, అలాగే లోకేష్ కూడా కలిశారని అన్నారు.

This post was last modified on October 12, 2023 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

50 minutes ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

7 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

7 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

9 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

9 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

10 hours ago