ఎలక్షన్లకు ఆర్నెళ్ల ముందు జగన్ స్పీడు పెంచుతున్నారు. వైసీపీ గ్రాఫ్ పడిపోతుందన్న అంచనాల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారు. ఆ క్రమంలోనే కంటికి కనిపించే పనులు చేయడం ప్రారంభించారు. ఇంతకాలం లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు వేయడంపైనే పూర్తి ఫోకస్ చేసిన జగన్ ఇప్పుడు వేరే సంక్షేమ పనులు, అభివృద్ధిపైనా దృష్టి పెడుతున్నారు. తాజాగా సామర్లకోటలో వెయ్యికి పైగా ఇళ్లకు ఒకేసారి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించడం అందులో భాగమే.
దాంతో జగన్ ప్రభుత్వం కొన్నాళ్లుగా ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. సామర్లకోటలో సుమారు వెయ్యి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి సామూహిక గృహ ప్రవేశాలతో మైలేజ్ తెచ్చుకుంది.
నిజానికి జగన్ ప్రభుత్వం 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. ఇది చాలా పెద్ద నంబరే. అయితే… ఆ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడంతో అపఖ్యాతి మూటగట్టుకుంది. 30.75 లక్షల మందికి మొత్తంగా 71,811 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఇందులో ఇప్పటివరకు 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది జగన్ ప్రభుత్వం. అయితే, అందులో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయి.
ఇంటి స్థలాన్ని ఫ్రీగా ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ. 1.80 లక్షల వరకు బిల్లు చెల్లిస్తోంది. దీనికి అదనంగా రూ. 15 వేల విలువైన ఇసుక ఉచితంగా ఇస్తోంది. ఐరన్, సిమెంట్పై రూ. 40 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. డ్వాక్రా మహిళలైతే రూ. 35 వేలు పావలా వడ్డీకి ఇస్తోంది.
కాగా ప్రభుత్వ సహాయంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. మరో 14 లక్షల ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తికానుందని జగన్ చెప్తున్నారు. తాము ఇళ్లు నిర్మించడం కాదని.. ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామని జగన్ చెప్తున్నారు.
This post was last modified on October 12, 2023 10:15 pm
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…