దేశంలోని పలు మీడియా సంస్థలు, పత్రికలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా చానెళ్లు కూడా అందుకు మినహాయింపు కాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు తమకు దన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా…వైరి వర్గాలకు ప్రతికూలంగా కథనాలు ప్రసారం చేస్తుంటాయని కొన్ని మీడియా సంస్థలపై సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.
కొన్ని పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, వైరి రాజకీయ పార్టీలపై మీడియా సంస్థలు విమర్శలు చేయడం..కథనాలు ప్రసారం చేయడం….ప్రోమోలు వేయడం మామూలేనని, అయితే, తాజాగా ఏపీలో ఓ కొత్త సంస్కృతికి రెండు ప్రముఖ చానెళ్లు తెరలేపాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఓ మీడియా సంస్థ అధినేతపై మరో మీడియా సంస్థ తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీవీ5,ఎన్టీవీ చానెళ్ల మధ్య మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారిందని, టీవీ5 అధినేత నాయుడు అవినీతిపై వరుస కథనాలు అంటూ ఎన్టీవీ విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
టీవీ 5 యాజమాన్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం, మోకాలినొప్పుల బామ్ ల తయారీలో అవినీతి, బోగస్ అంటూ ఎన్టీవీ ప్రోమోలు విడుదల చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక నాయుడు వంద లీలల పేరుతో వరస కథనాలు అంటూ ఎన్టీవీ విడుదల చేసిన ప్రోమోతో ఇరు చానెళ్ల మధ్య వివాదం తారస్థాయికి చేరిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఒక మీడియా సంస్థ మీద మరో మీడియా సంస్థ ఇంటరాగేషన్ చేయడం…కథనాలు ప్రసారం చేయడం వంటి కొత్త సంస్కృతికి రెండు తెలుగు మీడియా చానెళ్లు తెరలేపడం చర్చనీయాంశమైంది. ఓ చానెల్ పై, దాని అధినేతపై నిఘా పెట్టడం…వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటి కొత్త వ్యవహారాలు తెరపైకి రావడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
కొత్త సంస్కృతికి తెరలేపిన ఆ మీడియా చానెళ్ల వ్యవహారశైలిపై చర్చించుకుంటున్నారు. ఈ రెండు చానెళ్ల మధ్య వివాదం సోషల్ మీడియాలో.వైరల్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు చానెళ్ల మధ్య చెలరేగిన వివాదానికి పుల్ స్టాప్ ఎపుడు పడుతుందోనని అనుకుంటున్నారు.
This post was last modified on August 21, 2020 12:41 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…