Political News

ఎన్టీవీ, టీవీ5ల మధ్య రచ్చపై నెటిజన్ల చర్చ…వైరల్

దేశంలోని పలు మీడియా సంస్థలు, పత్రికలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా చానెళ్లు కూడా అందుకు మినహాయింపు కాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు తమకు దన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా…వైరి వర్గాలకు ప్రతికూలంగా కథనాలు ప్రసారం చేస్తుంటాయని కొన్ని మీడియా సంస్థలపై సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.

కొన్ని పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, వైరి రాజకీయ పార్టీలపై మీడియా సంస్థలు విమర్శలు చేయడం..కథనాలు ప్రసారం చేయడం….ప్రోమోలు వేయడం మామూలేనని, అయితే, తాజాగా ఏపీలో ఓ కొత్త సంస్కృతికి రెండు ప్రముఖ చానెళ్లు తెరలేపాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఓ మీడియా సంస్థ అధినేతపై మరో మీడియా సంస్థ తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీవీ5,ఎన్టీవీ చానెళ్ల మధ్య మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారిందని, టీవీ5 అధినేత నాయుడు అవినీతిపై వరుస కథనాలు అంటూ ఎన్టీవీ విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

టీవీ 5 యాజమాన్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం, మోకాలినొప్పుల బామ్ ల తయారీలో అవినీతి, బోగస్ అంటూ ఎన్టీవీ ప్రోమోలు విడుదల చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక నాయుడు వంద లీలల పేరుతో వరస కథనాలు అంటూ ఎన్టీవీ విడుదల చేసిన ప్రోమోతో ఇరు చానెళ్ల మధ్య వివాదం తారస్థాయికి చేరిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఒక మీడియా సంస్థ మీద మరో మీడియా సంస్థ ఇంటరాగేషన్ చేయడం…కథనాలు ప్రసారం చేయడం వంటి కొత్త సంస్కృతికి రెండు తెలుగు మీడియా చానెళ్లు తెరలేపడం చర్చనీయాంశమైంది. ఓ చానెల్ పై, దాని అధినేతపై నిఘా పెట్టడం…వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటి కొత్త వ్యవహారాలు తెరపైకి రావడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

కొత్త సంస్కృతికి తెరలేపిన ఆ మీడియా చానెళ్ల వ్యవహారశైలిపై చర్చించుకుంటున్నారు. ఈ రెండు చానెళ్ల మధ్య వివాదం సోషల్ మీడియాలో.వైరల్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు చానెళ్ల మధ్య చెలరేగిన వివాదానికి పుల్ స్టాప్ ఎపుడు పడుతుందోనని అనుకుంటున్నారు.

This post was last modified on August 21, 2020 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీవారి వైకుంఠ ద‌ర్శ‌నం… సెక‌నుకు 8 మంది!

ఔను! నిజం. మీరు చ‌దివింది అక్ష‌రాలా క‌రెక్టే!. సెక‌ను అంటే రెప్ప‌పాటు కాలం. ఈ రెప్ప‌పాటు కాలంలోనే అఖిలాండ కోటి…

22 minutes ago

ఆ ముగ్గురు అనుకుంటే ప్రభుత్వంలో జరగనిది ఏది లేదు

భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

56 minutes ago

ఏపీలో ఏంటీ ‘చిన్న పురుగు’ టెన్షన్

ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…

1 hour ago

ప‌వ‌న్ సినిమాల‌ను ఆయ‌నేంటి ఆపేది – పేర్ని నాని

కొన్ని రోజుల కింద‌ట కోన‌సీమ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారిన…

7 hours ago

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

12 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

12 hours ago