జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని.. లోక్ సభ ఎన్నికల్ని నిర్వహించాలన్న సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం రాష్ట్రాల్ని కాకున్నా.. అత్యధిక రాష్ట్రాలను లోక్ సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తున్న వేళ.. ఇంతకూ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ గడువు మాటేమిటి? ఎప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి గుడువు ఉందన్నది ఆసక్తికరంగా మారింది.
జమిలి ఎన్నికల్ని నిర్వహించాల్సి వస్తే.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు తీసుకురావటం.. మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని గడువు తీరిన తర్వాత పొడిగించాల్సి ఉంటుంది. ఇంతకీ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం ఎప్పటివరకు ఉందన్న విషయాన్ని చూస్తే.. పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ డిసెంబరు (2023)తో గడువు ముగిసే రాష్ట్ర అసెంబ్లీ జాబితాలో మిజోరం ఒక్కటే ఉంది.
అదే జనవరి 2024 లోపు అసెంబ్లీని కొలువు తీర్చాల్సిన జాబితాలో తెలంగాణ.. ఛత్తీస్ గడ్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్ లు ఉన్నాయి. జూన్ 2024 నాటికి ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. ఒడిశా.. సిక్కింలు ఉన్నాయి. నవంబరు 2024 నాటికి హర్యానా.. మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 2024 నాటికి జార్ఖండ్.. 2025 ఫిబ్రవరి నాటికి ఢిల్లీ.. 20254 నవంబరు నాటికి బిహార్ రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. 2026 మే నాటికి అసోం.. కేరళ.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ గడువు ముగుస్తుండగా.. 2026 జూన్ లో పుదుచ్చేరి గడువు పూర్తి అవుతుంది.
2027 మార్చికి గోవా.. మణిపూర్.. పంజాబ్.. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి గడువు పూర్తి కానుండగా.. 2027 మే నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంబ్లీ గడువు పూర్తి కానుంది. 2027 డిసెంబరు నాటికి గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. 2028 మార్చికి మేఘాలయ.. నాగాలాండ్.. త్రిపుర.. మే 2028 నాటికి కర్నాటక రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక.. జమ్ముకశ్మీర్.. లద్దాఖ్ విషయానికి వస్తే.. వీటిని మూడు ముక్కలుగా చేసిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఎన్నిల్ని నిర్వహించలేదు.
ఇక.. జమిలి ఎన్నికల్ని నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికారణల్ని సవరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సవరణల కోసమే తాజాగా ప్రత్యేక సమావేశాల్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందోచూడాలి. లోక్ సభలో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో అంతంతమాత్రంగానే మెజార్టీ ఉన్న వేళలో.. ఇవన్నీ సాధ్యమవుతాయా? అన్నది అసలు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…