జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని.. లోక్ సభ ఎన్నికల్ని నిర్వహించాలన్న సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం రాష్ట్రాల్ని కాకున్నా.. అత్యధిక రాష్ట్రాలను లోక్ సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తున్న వేళ.. ఇంతకూ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ గడువు మాటేమిటి? ఎప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి గుడువు ఉందన్నది ఆసక్తికరంగా మారింది.
జమిలి ఎన్నికల్ని నిర్వహించాల్సి వస్తే.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు తీసుకురావటం.. మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని గడువు తీరిన తర్వాత పొడిగించాల్సి ఉంటుంది. ఇంతకీ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం ఎప్పటివరకు ఉందన్న విషయాన్ని చూస్తే.. పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ డిసెంబరు (2023)తో గడువు ముగిసే రాష్ట్ర అసెంబ్లీ జాబితాలో మిజోరం ఒక్కటే ఉంది.
అదే జనవరి 2024 లోపు అసెంబ్లీని కొలువు తీర్చాల్సిన జాబితాలో తెలంగాణ.. ఛత్తీస్ గడ్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్ లు ఉన్నాయి. జూన్ 2024 నాటికి ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. ఒడిశా.. సిక్కింలు ఉన్నాయి. నవంబరు 2024 నాటికి హర్యానా.. మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 2024 నాటికి జార్ఖండ్.. 2025 ఫిబ్రవరి నాటికి ఢిల్లీ.. 20254 నవంబరు నాటికి బిహార్ రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. 2026 మే నాటికి అసోం.. కేరళ.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ గడువు ముగుస్తుండగా.. 2026 జూన్ లో పుదుచ్చేరి గడువు పూర్తి అవుతుంది.
2027 మార్చికి గోవా.. మణిపూర్.. పంజాబ్.. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి గడువు పూర్తి కానుండగా.. 2027 మే నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంబ్లీ గడువు పూర్తి కానుంది. 2027 డిసెంబరు నాటికి గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. 2028 మార్చికి మేఘాలయ.. నాగాలాండ్.. త్రిపుర.. మే 2028 నాటికి కర్నాటక రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక.. జమ్ముకశ్మీర్.. లద్దాఖ్ విషయానికి వస్తే.. వీటిని మూడు ముక్కలుగా చేసిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఎన్నిల్ని నిర్వహించలేదు.
ఇక.. జమిలి ఎన్నికల్ని నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికారణల్ని సవరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సవరణల కోసమే తాజాగా ప్రత్యేక సమావేశాల్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందోచూడాలి. లోక్ సభలో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో అంతంతమాత్రంగానే మెజార్టీ ఉన్న వేళలో.. ఇవన్నీ సాధ్యమవుతాయా? అన్నది అసలు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…