నిన్న సలార్ వాయిదా వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అఫీషియల్ గా హోంబాలే ఫిలిమ్స్ ఇంకా ప్రకటన ఇవ్వనప్పటికీ డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు న్యూస్ రావడం, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అర్ధాంతరంగా ఆపేయడం లాంటివి ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి. దెబ్బకు ఇతర నిర్మాతలు అలెర్ట్ అయిపోయి సెప్టెంబర్ 28 తమ సినిమా రిలీజ్ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఆన్న మ్యాడ్ లాంటివి అఫీషియల్ పోస్టర్లు విడుదల చేయగా మరికొన్ని అదే పనిలో బిజీగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా తమ హీరోకే ఎందుకు ఇలా జరుగుతోందని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. బాహుబలి నుంచి ఇదే తంతు. అది భారీ గ్రాండియర్ కాబట్టి రాజమౌళి కోసం అంత త్యాగం చేసినా దానికి తగ్గ గొప్ప ఫలితం దక్కింది కాబట్టి ఆ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ సాహో, రాధే శ్యామ్ లు లెక్కలేనన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యాయి. సోషల్ మీడియాలో యువి మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో మనకు తెలియంది కాదు. ఆదిపురుష్ సైతం సంక్రాంతి నుంచి జూన్ కు వెళ్లిన బాపతే. ఇంతా చేసి పోనీ ఇవి హిట్టయితే సంతోషమే. కానీ డిజాస్టర్లుగా మిగిలాయి.
సరే పోనీ సలార్ తో మొత్తం సెట్ అయిపోతుందనుకుంటే ఇది కూడా అదే బాట పడుతోంది. ప్లానింగ్ లో మంచి పేరున్న హోంబాలే ఇలా చేయడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీని కోసం ప్రభాస్ చాలా కాల్ షీట్లు ఇచ్చాడు. తగినంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించారు. అయినా సరే మంచి డేట్ ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ కానీ ప్రెస్ నోట్ కానీ రాకపోవడం మరింత వేడిని రాజేస్తోంది. వేగంగా సినిమాలు చేస్తున్నా రిలీజ్ డేట్ల పంచాయితీలో ప్రభాస్ కు జరుగుతున్నది ముమ్మాటికీ దురదృష్టమే
This post was last modified on September 2, 2023 9:49 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…