Political News

అక్రమాల్లో పీహెచ్‌డీ చేసిన బాబు: సజ్జల!

ఓట్ల తొలగింపుపై టీడీపీ రాద్దాంతం చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.గురువారంనాడు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్న విషయం గుర్తించామన్నారు. దీంతో చంద్రబాబులో వణుకు మొదలైందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

అక్రమాలు చేయడంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. దొంగ ఓట్ల బాధితులం తామేనని ఆయన చెప్పారు.టీడీపీకి తెలిసిందల్లా తప్పుడు పనులు చేయడమేనన్నారు.2015-17 కాలంలో 50 లక్షల ఓట్లను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను చేర్పించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అలవాటు కూడా తమకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓట్ల తొలగింపులో టీడీపీ చేసిన అక్రమాలపై తాము గతంలో పోరాటం చేసినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తమ పార్టీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తుందన్నారు.చంద్రబాబు విద్యలు అందరికీ తెలుసునన్నారు. గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటేనన్నారు. గతంలో సేవామిత్ర పేరుతో టీడీపీ నేతలు అక్రమాలు చేశారన్నారు.

దొంగ ఓట్ల విషయమై న్యూఢిల్లీలోని సీఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తుంది. దొంగ ఓట్ల విషయమై అధికార వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం సాగుతుంది. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల అంశానికి సంబంధించి ఇద్దరు అధికారుల సస్పెన్షన్ విషయమై మరోసారి రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రమయ్యాయి.

This post was last modified on August 24, 2023 6:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

12 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

12 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

14 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

14 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

19 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

20 hours ago