Movie News

ఇద్దరు సీతలు సమానంగా పంచుకున్నారు

అరవై తొమ్మిదవ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే కావడం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కు గాను అలియా భట్, మిమిలో అదిరిపోయే నటన ప్రదర్శించినందుకు కృతి సనన్ ని కమిటీ గుర్తించింది. ఒకరు ఆర్ఆర్ఆర్ లో సీతగా నటిస్తే మరొకరు ఆదిపురుష్ లో రామసతి సాధ్విమణిగా మెప్పించింది. కాకతాళీయమే అయినప్పటికీ తక్కువ గ్యాప్ లో ఇద్దరూ సీత పేరుతో పాత్రల్లో కనిపించడం విశేషం. ఈ సినిమాలు అవార్డులకు సంబంధం లేనిదే అయినా చెప్పుకోదగ్గ వార్తేగా.

ఎలా చూసుకున్నా అలియా, కృతిలు దీనికి సంపూర్ణంగా అర్హత కలిగినవాళ్ళే. కృతి సనన్ కి టాలీవుడ్ తో ఎక్కువ అనుబంధం ఉంది. మహేష్ బాబు 1 నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్ లు చేసింది కానీ వాటి ఫలితాలు అచ్చిరాక హిందీ సినిమాలకు పరిమితమయ్యింది. ఎక్కువ గ్లామర్ పాత్రలకు వాడుకునే తనకు నటనలో స్కోప్ దక్కింది మిమిలోనే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎంటర్ టైనర్ లో కృతి నటన చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక గంగూబాయ్ లో వేశ్యగా అలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. నటించడం కన్నా జీవించిందని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.

ఇతర భాషలతో పోలిస్తే ఈసారి టాలీవుడ్ డామినేషన్ సంపూర్ణంగా కనిపించింది. కన్నడలో 777 ఛార్లీ, మలయాళంలో హోమ్, తమిళంలో కడైసి వివసాయిలు గుర్తింపు దక్కించుకున్నాయి. కోలీవుడ్ కు మాత్రం పెద్ద అసంతృప్తి మిగిలింది. కన్నడలో ఎప్పుడూ నెంబర్ భారీగా ఉండదు కాబట్టి ఆశ్చర్యం లేదు కానీ కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టే మళయాలంలోనూ ఈసారి ఎక్కువగా హైలైట్ అయినవి లేకపోవడం గమనార్హం. మొత్తానికి జాతీయ అవార్డులు కొంచెం ఇష్టం కొంచెం కష్టం తరహాలో అన్ని ఇండస్ట్రీలను సమాన స్థాయిలో మెప్పించడం కష్టమని తేలిపోయింది.

This post was last modified on August 24, 2023 8:02 pm

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

22 minutes ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

2 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

5 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

5 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

5 hours ago