Movie News

ఇద్దరు సీతలు సమానంగా పంచుకున్నారు

అరవై తొమ్మిదవ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే కావడం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కు గాను అలియా భట్, మిమిలో అదిరిపోయే నటన ప్రదర్శించినందుకు కృతి సనన్ ని కమిటీ గుర్తించింది. ఒకరు ఆర్ఆర్ఆర్ లో సీతగా నటిస్తే మరొకరు ఆదిపురుష్ లో రామసతి సాధ్విమణిగా మెప్పించింది. కాకతాళీయమే అయినప్పటికీ తక్కువ గ్యాప్ లో ఇద్దరూ సీత పేరుతో పాత్రల్లో కనిపించడం విశేషం. ఈ సినిమాలు అవార్డులకు సంబంధం లేనిదే అయినా చెప్పుకోదగ్గ వార్తేగా.

ఎలా చూసుకున్నా అలియా, కృతిలు దీనికి సంపూర్ణంగా అర్హత కలిగినవాళ్ళే. కృతి సనన్ కి టాలీవుడ్ తో ఎక్కువ అనుబంధం ఉంది. మహేష్ బాబు 1 నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్ లు చేసింది కానీ వాటి ఫలితాలు అచ్చిరాక హిందీ సినిమాలకు పరిమితమయ్యింది. ఎక్కువ గ్లామర్ పాత్రలకు వాడుకునే తనకు నటనలో స్కోప్ దక్కింది మిమిలోనే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎంటర్ టైనర్ లో కృతి నటన చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక గంగూబాయ్ లో వేశ్యగా అలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. నటించడం కన్నా జీవించిందని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.

ఇతర భాషలతో పోలిస్తే ఈసారి టాలీవుడ్ డామినేషన్ సంపూర్ణంగా కనిపించింది. కన్నడలో 777 ఛార్లీ, మలయాళంలో హోమ్, తమిళంలో కడైసి వివసాయిలు గుర్తింపు దక్కించుకున్నాయి. కోలీవుడ్ కు మాత్రం పెద్ద అసంతృప్తి మిగిలింది. కన్నడలో ఎప్పుడూ నెంబర్ భారీగా ఉండదు కాబట్టి ఆశ్చర్యం లేదు కానీ కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టే మళయాలంలోనూ ఈసారి ఎక్కువగా హైలైట్ అయినవి లేకపోవడం గమనార్హం. మొత్తానికి జాతీయ అవార్డులు కొంచెం ఇష్టం కొంచెం కష్టం తరహాలో అన్ని ఇండస్ట్రీలను సమాన స్థాయిలో మెప్పించడం కష్టమని తేలిపోయింది.

This post was last modified on August 24, 2023 8:02 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

7 mins ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

3 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

4 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

4 hours ago