ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని తనకు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..లోకేష్ వల్ల ప్రాణహాని ఉందని నేను డీజీపీని కలిశాను. ఆయన నాకు భద్రత కల్పిస్తామన్నారని ఆయన మీడియాతో తెలిపారు. మొదట నారా లోకేష్ నన్ను టీడీపీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నేను టీడీపీలో చేరకపోయే సరికి నా మీద కక్ష కట్టాడు అని పేర్కొన్నారు.
నేను ఏ కార్యక్రమంలో అయినా లోకేష్ గురించి గట్టిగా చెబుతున్నాను కాబట్టే ఆయన నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లోకేష్ గురించి నిజాలు అన్ని బయటపెట్టింది నేనే. అందుకే ఆయన అందరినీ బట్టలిప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది బట్టలూడదీస్తావు అని ఆయన ప్రశ్నించారు.
ఆ యాత్ర..ఈ యాత్ర అంటూ పాదయాత్రలు చేస్తున్న లోకేష్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేనప్పుడు పవన్ ని సీఎంని చేస్తానని ఆయన చెప్పాలని కోరారు. జగన్ అంటే నాకు ప్రాణం.. 13 సంవత్సరాల నుండి ఆయనతోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు.
This post was last modified on August 24, 2023 11:45 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…