Political News

పోసానికి ప్రాణహాని.. నిజమా?

ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్‌ ను కలిశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని తనకు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..లోకేష్‌ వల్ల ప్రాణహాని ఉందని నేను డీజీపీని కలిశాను. ఆయన నాకు భద్రత కల్పిస్తామన్నారని ఆయన మీడియాతో తెలిపారు. మొదట నారా లోకేష్‌ నన్ను టీడీపీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నేను టీడీపీలో చేరకపోయే సరికి నా మీద కక్ష కట్టాడు అని పేర్కొన్నారు.

నేను ఏ కార్యక్రమంలో అయినా లోకేష్‌ గురించి గట్టిగా చెబుతున్నాను కాబట్టే ఆయన నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లోకేష్‌ గురించి నిజాలు అన్ని బయటపెట్టింది నేనే. అందుకే ఆయన అందరినీ బట్టలిప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది బట్టలూడదీస్తావు అని ఆయన ప్రశ్నించారు.

ఆ యాత్ర..ఈ యాత్ర అంటూ పాదయాత్రలు చేస్తున్న లోకేష్‌ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేనప్పుడు పవన్‌ ని సీఎంని చేస్తానని ఆయన చెప్పాలని కోరారు. జగన్ అంటే నాకు ప్రాణం.. 13 సంవత్సరాల నుండి ఆయనతోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు.

This post was last modified on August 24, 2023 11:45 am

Share
Show comments
Published by
Satya
Tags: Lokesh

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago