Political News

శాసించిన చోటే అర్థించే స్థాయికి.. ఎంత‌ ఖ‌ర్మ‌!

ఔను.. తెలంగాణ‌లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఒక‌ప్పుడు శాసించిన నియోజ‌క‌వ‌ర్గాలు.. జిల్లాల్లో క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి అర్ధించే స్థాయికి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండు రోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు భిన్న‌మైన రీతిలో జ‌రుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ కోసం.. కామ్రెడ్లు ఎదురు చూస్తున్నారు. మ‌రో మూడు నాలుగు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో త‌మ ప‌రిస్థితిని తేల్చాల‌ని వారు కోరుతున్నారు.

టికెట్ల విష‌యానికి వ‌స్తే.. ఈ విష‌యంలో కేసీఆర్ కూడా తొంద‌ర‌గానే తేల్చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, ఆచితూచి మాత్ర‌మే ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. క‌మ్యూనిస్టుల కు రెండు స్థానాలు మాత్ర‌మే ఇస్తామ‌ని వ‌ర్త‌మానం పంపించారు. వాస్త‌వానికి 2014లో రాష్ట్రం ఆవిర్భ‌వించిన నాటి నుంచి కూడా ఏనాడూ కేసీఆర్ వారివైపు చూడ‌లేదు. పైగా కమ్యూనిస్టులను డైల్యూట్ చేయ‌డానికే ఆయ‌న ప్ర‌య‌త్నించారు. కామ్రెడ్ నోముల న‌ర‌సింహ‌య్య‌ను పార్టీలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

అయితే.. మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో కుంజ‌ర యూధంబు అన్న‌ట్టుగా కేసీఆర్ కమ్యూనిస్టుల‌ను సాయం కోరారు. దీంతో క‌మ్యూనిస్టులు .. మాక‌ది-మీకిది త‌ర‌హాలో మునుగోడు ఉప పోరులో కేసీఆర్ త‌ర‌ఫున శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేసి గెలిపించారు. ఇక‌, ఇప్పుడు కేసీఆర్ వంతు వ‌చ్చింది. అప్ప‌టి విష‌యాలు మ‌రిచిపోయారా? లేక కమ్యూనిస్టుల బ‌లం ఇంతేన‌ని నిర్ధారించుకున్న‌రో తెలియ‌దు కానీ.. వారికి(సీపీఐ), సీపీఎంల‌కు చెరో సీటు ఇస్తామ‌న్నారు.

కానీ, వాస్త‌వానికి సీపీఐ, సీపీఎంల‌ను గ‌మ‌నిస్తే.. క్షేత్ర‌స్థాయిలో ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్, న‌ల్ల‌గొండ వంటి జిల్లాల్లో ప‌ట్టుంది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. బ‌ల‌మైన ఓటు బ్యాంకు కూడా ఉంది. కానీ, కొన్ని కొన్ని కార‌ణాల‌తో క‌మ్యూనిస్టులు ఇత‌ర పార్టీల‌వైపు మొగ్గు చూప‌డం.. పార్టీ ప‌రంగా ఉద్య‌మిస్తున్నా.. విధానాల పరంగా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పొవ‌డం వంటి కార‌ణాలో వాసి-రాసిలో క‌మ్యూనిస్టులు కొంత వెనుక‌బ‌డ్డారు.

ఇక‌, ఇప్పుడు వారే కేసీఆర్ వెంట‌బ‌డి.. క‌నీసం మూడేసి టికెట్లు అయినా త‌మ‌కు కేటాయించాల‌ని కామ్రెడ్స్ ప‌ట్టుబ‌డుతున్నారు. వీటిలో సీపీఐ బెల్లంప‌ల్లి, కొత్త‌గూడెం, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాలు కావాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఇక‌, సీపీఎం మిర్యాల‌గూడ‌, పాలేరు, భ‌ద్రాచ‌లం నియోజ‌కవ‌ర్గాల‌ను త‌మ‌కు కేటాయించాల‌ని కోరుతున్నాయి. వాస్త‌వానికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాలే కాదు.. జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నా.. ఒక‌ప్పుడు బాగానే ఉన్న ప‌రిస్తితి.. ఇప్పుడు అర్థించే స్థాయికి వ‌చ్చింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

This post was last modified on July 31, 2023 5:31 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

1 hour ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

1 hour ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

1 hour ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

3 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

3 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

5 hours ago