ఎలాగైనా సరే.. గెలిచి తీరాలని వైసీపీ అధిష్టానం నిర్దేశించుకున్న నియోజకవర్గాల్లో రాజమండ్రి సిటీ నియో జకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసిన కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలనేది వైసీపీ లక్ష్యం. దీంతో రాజమండ్రిలో అనేక ప్రయోగాలు చేస్తుండడం గమనార్హం. ఇప్పటికి ఇక్కడ నలుగురు ఇంచార్జ్లను మార్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజుల కిందట రాజమండ్రి సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను నియమించారు. అయితే.. గత నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్ ఐదో ఇంచార్జ్ కావడం గమనార్హం. మొదట్లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కోఆర్డినేటర్గా ఉండేవారు. అయితే.. ఆయనకు ఎంపీకి సరిపోలేదు. దీంతో ఆయన్ను తప్పించి సీఎం జగన్ స్వయంగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యంను నియమించారు.
అయినా.. ఇక్కడ వైసీపీ పుంజుకోలేదు. పైగా.. అంతర్గత కుమ్ములాటలు కూడా ఆగలేదు. దీంతో కొన్ని నెలలకే ఆయనను తప్పించి.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఈయన కూడా ఇక్కడి వైసీపీ నాయకులకు సరిపోలేదు. దీంతో ఏకంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు సిటీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మరింతగా ఇక్కడ రాజకీయం వేడెక్కింది. ఎంపీగా ఉన్న తనకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని ఆయన భావించారు.
ఈ క్రమంలోనే డాక్టర్ శ్రీనివాస్ను స్వయంగా ఎంపీనే సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు. సిటీలో ఒక పక్క మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. మరోక పక్క శివరామసుబ్రహ్మణ్యం వంటి నేతలను పక్కన పెట్టి డాక్టర్ శ్రీనివాస్కు పగ్గాలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. అయితే.. ఇదంతా కూడాపార్టీ బలోపేతానికే చేస్తున్నట్టు చెబుతున్నా.. అంతర్గతంగా పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడం వైసీపీ పిల్లిమొగ్గలు వేస్తోందన్నది పరిశీలకుల మాట.
This post was last modified on July 28, 2023 2:21 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…