Political News

ఆ వర్గాన్ని జగన్ వద్దనుకున్నారా?

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశారా? ఇప్ప‌టి వ‌ర‌కు క్ష‌త్రియ వ‌ర్గం అనుకూలంగా ఉండేందుకు ఆయ‌న అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. తాజాగా ఆయ‌న త‌ప్పు చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా పేర్కొన్నారు. అదే.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మం. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనికి సంబంధించి చంద్ర‌బాబు హ‌యాంలోనే 2018లో క్ష‌త్రియ వ‌ర్గం కోరిక మేర‌కు ఆయ‌న జీవో కూడా ఇచ్చారు.

ఇక‌, అప్ప‌టి నుంచి విధిగా జూలై 4న ప్ర‌తి ఏడాదీ.. మ‌న్యం వీరుడి జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఇక‌, తాజాగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన జ‌గ‌న్‌.. ఎక్క‌డా ఆ ఊసు ఎత్త‌కుండా.. ఆయ‌న చిత్తూరులో ప‌ర్య‌టించారు. పోనీ.. అక్క‌డైనా అల్లూరికి నివాళులు అర్పించి ఉంటే.. క‌థ వేరేగా ఉండేది. కానీ..అస‌లు సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. మ‌రి సీఎం జ‌గ‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైసీపీ నాయ‌కులు కూడా అదే బాట‌లో న‌డిచారు.

దీంతో అల్లూరిని సీఎం జ‌గ‌న్ మ‌రిచిపోయారంటూ.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ఒక టాక్ న‌డుస్తోంది. ఇదే స‌మ‌యంలో క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూడా.. వైసీపీ నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టించుకోలేదు. దీంతో ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ‌ను విస్మ‌రిస్తున్నారా? అని క్ష‌త్రియులు చ‌ర్చిస్తున్నారు. త‌మ కులానికి చెందిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజును అవ‌మానించిన వైనాన్ని ఇప్ప‌టికీ క్ష‌త్రియులు జీర్ణించుకోలేక పోతున్నార‌నేది రాజ‌కీయంగా త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇలాంటి స‌మ‌యంలో వారిని అంతో ఇంతో శాంత ప‌రిచేందుకు వ‌చ్చిన అల్లూరి జ‌యంతి అవ‌కాశాన్ని సీఎం జ‌గ‌న్ జార విడుచుకున్నార‌ని.. కొంద‌రు వైసీపీ నాయ‌కులు కూడా భావిస్తున్నారు. ఇక‌, వ‌చ్చే ఏడాది చేద్దామ‌న్నా.. ఈ ప్ర‌భుత్వం ఉంటుందో ఉండ‌దో తెలియ‌ని ప‌రిస్థితి. ఇదిలావుంటే.. క్ష‌త్రియులు క‌నుక ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటే.. కీల‌క‌మైన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని క్ష‌త్రియ ఓటు బ్యాంకు వైసీపీకి దూరం కావ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 5, 2023 1:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

32 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

47 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago