ఒకపార్టీలో జరిగే డెవలప్మెంట్లు కచ్చితంగా మరో పార్టీపైన కూడా ప్రభావం చూపుతుంది. కాకపోతే ఆ ప్రభావం నెగిటివా లేకపోతే పాజిటివా అన్నదే కీలకం. ఇపుడు బీజేపీలో జరిగిన డెవలప్మెంట్లు కేసీయార్ కు కచ్చితంగా అనుకూలంగానే ఉంటుందని అర్ధమవుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండ సంజయ్ ను తీసేసి సడెన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ డెవలప్మెంట్ కేసీయార్ కు బాగా అనుకూలించేదనే చెప్పాలి.
ఎలాగంటే అధ్యక్షుడి ఉన్నపుడు బండి ముఖ్యమంత్రి కేసీయార్ వెంటపడేవాళ్ళు. ప్రతి విషయంలోను కేసీయార్ లేదా ఆయన కుటుంబాన్ని పిక్చర్లోకి లాగి రాచి రంపాన పెట్టేవారు. మర్యాద, హుందాతనం అన్నది బండి మాటల్లో పెద్దగా వినబడేదికాదు. పక్కా మస్ మసాలా మాటలు, డైలాగులు ఉపయోగించేవారు. చాలాసార్లు బండి మాటలు అన్నీ హద్దులను దాటేసేవారు. దాంతో బండి ఉపయోగించిన భాషపై చాలా రాద్దాంతమే జరిగింది.
ఇక కిషన్ విషయం చూస్తే బండిలాగ మాస్ మసాలా భాషను ఉపయోగించలేరు. ప్రత్యర్ధులపై కౌంటర్లు గట్టిగానే వేస్తారు, ధాటిగా పాయింట్ బై పాయిట్ మాట్లాడుతారు. అయితే ఒకస్ధాయికి దిగిపోయి కిషన్ మాట్లాడలేరు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇక్కడే బండికి, కిషన్ కి మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. అందుకనే కేసీయార్, ఆయన కుటుంబంపై కిషన్ మాట్లాడే మాటలు, విసిరే పంచులు పెద్దగా ప్రభావం చూపవనే ప్రచారం మొదలైపోయింది.
ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో కిషన్ వేసే పంచులు గట్టిగా ఉండకపోతే ప్రత్యర్ధులపై ఎలాంటి ప్రభావం కూడా చూపవు. పంచులు ప్రభావం చూపకపోతే ఎవరు లెక్కచేయరు. ఇక్కడే కిషన్ కు మైనస్ మార్కులు తప్పవు. బండిని తప్పించి కిషన్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించగానే కేసీయార్ తో పాటు యావత్ బీఆర్ఎస్ నేతలు హ్యాపీగా ఫీలయ్యుంటారు. బండి దూసుకుపోయినట్లు కిషన్ దూసుకుపోలేరు. చెప్పుకోవాలంటే కిషన్లో మైనస్ మార్కులు చాలానే ఉన్నాయి. అందుకనే బీజేపీలో జరిగిన మార్పులు కచ్చితంగా కేసీయార్ హ్యాపీగా ఫీలవుతుంటారనటంలో సందేహంలేదు.
This post was last modified on July 5, 2023 2:35 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…