శాకుంతలం డిజాస్టర్ దెబ్బకు అది విడుదలైన మూడో రోజే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళిపోయిన సమంతా కొద్దిరోజుల క్రితమే ఇండియా వచ్చి బాలన్స్ ఉన్న ఖుషికి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొంటోంది. ఇంకో వారంలోపే మొత్తం పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇదయ్యాక సామ్ ఓ ఏడాది పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతోందనే వార్త ఫ్యాన్స్ మధ్య వైరల్ గా మారింది. గతంలో అనారోగ్యం బారిన పడినప్పుడు దానికి సంబంధించిన చికిత్స ఇంకొంత ఉందట. అందులో భాగంగానే డాక్టర్లు రెస్టు తీసుకోమని చెప్పారని ఇన్ సైడ్ టాక్.
సమంత ఇది అఫీషియల్ గా చెప్పలేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఖుషి సెప్టెంబర్ 1 విడుదల కానుంది. కనీసం నెల రోజుల పాటు ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. సామ్ అందుబాటులో ఉండటం చాలా అవసరం. విజయ్ దేవరకొండ ఎంత తిరిగినా మెయిన్ హీరోయిన్ పబ్లిసిటీలో భాగం కావాల్సిందే. అయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. శాకుంతలం ఈవెంట్లకు ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డ సామ్ అదంతా కేవలం సానుభూతి కోసమేననే ట్రోల్స్ ని సోషల్ మీడియాలో ఫేస్ చేయాల్సి వచ్చింది.
కావాలని చేయకపోయినా దీని మీద ట్విట్టర్ లో పెద్ద రచ్చే జరిగింది. కథ ఇక్కడితో అయిపోలేదు. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ స్ట్రీమింగ్ ని అమెజాన్ ప్రైమ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ప్లాన్ చేస్తోంది. దానికి భారీ ఎత్తున ప్రమోషన్లు సిద్ధం చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఏ వెబ్ సిరీస్ కి జరగనంత హంగామా దీనికి ఉంటుందని ఓటిటి వర్గాల కథనం. అందులో భాగంగా సమంతా యాక్టివ్ గా పాల్గొనాల్సి ఉంటుంది. సో 2023 గడిచాక వచ్చే సంవత్సరం రిలాక్స్ అవ్వొచ్చు. అన్నట్టు కొత్త కమిట్ మెంట్ల కోసం తీసుకున్న అడ్వాన్సులను సమంతా వెనక్కు ఇచ్చినట్టు వినికిడి
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…