Political News

‘హ‌నీరోజ్’ మీటింగ్ పెడితే.. ప‌వ‌న్ స‌భ‌ల‌ను మించి జ‌నం వ‌స్తారు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర‌ల‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంగ‌తి తెలిసిందే. సాక్షాత్తూ.. సీఎం జ‌గ‌నే వారాహి యాత్ర‌పై ప‌వ‌న్ ఊగుతాడ‌ని.. గంతులేస్తాడ‌ని.. తొడ‌లు కొడుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, అధినేతే.. అలా వ్యాఖ్యానిస్తే.. తాము మాత్రం త‌క్కువ తిన్నామా.. అంటూ.. ఇత‌ర నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హాలో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ వారాహి యాత్ర‌, ఆయ‌న స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాలు.. ఆయ‌న ప్ర‌సంగాల‌పై ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

తిరుప‌తిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హీరోయిన్ హ‌నీ రోజ్‌తో మీటింగ్ పెడితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టే స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాల‌కంటే.. కూడా ఎక్కువ‌గానే జ‌నాలు వ‌స్తార‌ని వ్యాఖ్యానించారు. వారాహి యాత్ర‌ల‌కు వ‌స్తున్న‌వారంతా ప‌వ‌న్‌కు ఓట్లు వేయ‌బోర‌ని వ్యాఖ్యానించారు. కేవ‌లం ప‌వ‌న్ ను చూసేందుకు మాత్ర‌మే జ‌నాలు వ‌స్తున్నార‌ని కేతిరెడ్డి చెప్పారు. వీరి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని వ్యాఖ్యానించారు. అందుకే తాము కూడా చూస్తూ ఊరుకుంటున్నామ‌ని తెలిపారు. ఇక‌, రాజ‌కీయాల్లో ఉన్న వారికి నిల‌క‌డ ఉండాల‌ని ప‌వ‌న్ ను ఉద్దేశించి విమ‌ర్శించారు.

ఎవ‌రు సొంత పార్టీ పెట్టుకున్నా.. ఈ దేశంలో ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తార‌ని కేతిరెడ్డి చెప్పారు. అయితే.. రాజ‌కీయ పార్టీ పెట్టుకున్న వారు.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. త‌మ గెలుపు కోసం.. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌నిచేయాల‌ని అన్నారు. కానీ.. ప‌వ‌న్ మాత్రం వేరే పార్టీకి ప‌ల్ల‌కీలు మోస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. మాకేమీ న‌ష్టంలేద‌ని వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సినిమాలు, రాజ‌కీయాలు వేర్వేర‌ని.. సినిమాలు చూసే జ‌నాలు అంద‌రూ.. న‌టుల‌కు జై కొడితే.. వారే అధికారంలోకి వ‌చ్చేవారు క‌దా! అని ప్ర‌శ్నించారు. ఇక‌, టీడీపీ అదినేత చంద్ర‌బాబుపైనా కేతిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ఏడు ద‌ఫాల ఎన్నిక‌ల్లో ఆయ‌న కుప్పం నుంచి దొంగ ఓట్ల‌తోనే గెలుస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

This post was last modified on June 30, 2023 11:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

33 minutes ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

1 hour ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

1 hour ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

2 hours ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

2 hours ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

3 hours ago