Political News

ఎంత మంది నార తీశారో చెప్పాలి: ప‌వ‌న్‌కు ముద్రగడ లేఖ‌

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వారాహి యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఫైర‌య్యారు. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ… ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మందికి నార తీశారో.. ఎంత మందిని కింద కూర్చోబెట్టారో.. ఎంత మంది బ‌ట్ట‌లూడ‌దీశారో చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు. ఈ మేర‌కు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం ప‌వ‌న్‌కు లేఖాస్త్రం సంధించారు. అయితే.. ముద్రగ‌డ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నాయ‌కుడు కూనంపాటి శ్రీనివాస‌రావు అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు.

ముద్రగ‌డ ఏమ‌న్నారంటే…

వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ముద్రగ‌డ‌ ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమని ఎద్దేవా చేశారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ సూచించారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. సత్తా చూపడానికి ముందుకు రావాలన్నారు. వారిని శాశ్వతంగా రాజకీయా ల నుండి తొలిగేలా చేయాలని తెలిపారు.

కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదన్నారు. “మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, కింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి” అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

జ‌న‌సేన కౌంట‌ర్ ఇదీ..

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నేత కూసంపూడి శ్రీనివాస్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇత‌ర పార్టీల నేత‌లు.. ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు మీరు ఏం చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయాల‌ని అనుక‌న్న‌ప్పుడు… అన్ని సంద‌ర్భాల్లోనూ ఒకేలా స్పందించాల‌ని సూచించారు. వైసీపీ చేస్తే.. ఒక‌విధంగా జ‌న‌సేన చేస్తే మ‌రో విధంగా స్పందించ‌డం .. కుట్ర రాజ‌కీయాల్లో భాగ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

Satya

Recent Posts

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

5 minutes ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

3 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

4 hours ago

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

4 hours ago

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

6 hours ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

7 hours ago