Political News

ఎంత మంది నార తీశారో చెప్పాలి: ప‌వ‌న్‌కు ముద్రగడ లేఖ‌

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వారాహి యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఫైర‌య్యారు. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ… ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మందికి నార తీశారో.. ఎంత మందిని కింద కూర్చోబెట్టారో.. ఎంత మంది బ‌ట్ట‌లూడ‌దీశారో చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు. ఈ మేర‌కు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం ప‌వ‌న్‌కు లేఖాస్త్రం సంధించారు. అయితే.. ముద్రగ‌డ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నాయ‌కుడు కూనంపాటి శ్రీనివాస‌రావు అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు.

ముద్రగ‌డ ఏమ‌న్నారంటే…

వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ముద్రగ‌డ‌ ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమని ఎద్దేవా చేశారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ సూచించారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. సత్తా చూపడానికి ముందుకు రావాలన్నారు. వారిని శాశ్వతంగా రాజకీయా ల నుండి తొలిగేలా చేయాలని తెలిపారు.

కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదన్నారు. “మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, కింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి” అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

జ‌న‌సేన కౌంట‌ర్ ఇదీ..

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నేత కూసంపూడి శ్రీనివాస్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇత‌ర పార్టీల నేత‌లు.. ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు మీరు ఏం చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయాల‌ని అనుక‌న్న‌ప్పుడు… అన్ని సంద‌ర్భాల్లోనూ ఒకేలా స్పందించాల‌ని సూచించారు. వైసీపీ చేస్తే.. ఒక‌విధంగా జ‌న‌సేన చేస్తే మ‌రో విధంగా స్పందించ‌డం .. కుట్ర రాజ‌కీయాల్లో భాగ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on June 20, 2023 1:49 pm

Share

Recent Posts

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

27 minutes ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

1 hour ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

2 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

2 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

3 hours ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

3 hours ago