జెట్ స్పీడ్ మీద దూసుకెళ్లేలా తమ పాలన ఉంటుందన్న స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చేశారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. గత శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. దాదాపు వారానికి తీవ్రమైన తర్జనభర్జనల అనంతరం ముఖ్యమంత్రిగా సిద్దూ.. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే. శనివారం తమ ప్రమాణ స్వీకారం ముగిసిన గంటల వ్యవధిలోనే.. మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించారు.
ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్టర 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎన్నికల్లో ఇచ్చిన కీలకమైన ఐదు హామీల్ని వెంటనే నెరవేరుస్తామని.. మరో ఒకట్రెండు గంటల్లో జరిగే తొలి క్యాబినెట్ భేటీలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందన్న మాటను చెప్పిన రాహుల్ మాటకు తగ్గట్లే.. తర్వాతి పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.
ఇందుకు తగ్గట్లే.. తాము ఎన్నికల్లో ఇచ్చిన ఐదు కీలక హామీల అమలుకు ఓకే చెబుతూ సీఎం సిద్ధూ సంతకం చేశారు. దీంతో.. ఎన్నికల వేళలో ఇచ్చిన కీలక హామీలను అమలుకు పచ్చ జెండా ఊపినట్లైంది. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ముఖ్యమైన ఐదు ఎన్నికల హామీల్ని అమలు చేసేందుకు ఓకే చెప్పేసిన నేపథ్యంలో.. తామిచ్చిన హామీల్నిపూర్తి చేసినట్లుగా ముఖ్యమంత్రి సిద్ధూ పేర్కొన్నారు.క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయనీ విషయాన్ని వెల్లడించారు.
మరో వారం వ్యవధిలో మరో క్యాబినెట్ భేటీ జరుగుతుందని చెప్పిన సిద్ధూ.. తాము సంతకం చేసిన హామీల అమలు అమల్లోకి వస్తాయని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకున్నట్లైందని పేర్కొన్నారు. ఈ ఐదు హామీల అమలుకు ఏడాదికి రూ.50వేల కోట్ల ఖర్చు అవుతుందన్న విషయాన్ని చెప్పారు. ఆర్థికపరమైన చిక్కులు వచ్చినప్పటికీ.. కన్నడ ప్రజలకు ఇచ్చిన హామీల్నితాము నెరవేర్చామన్నారు. తామిచ్చిన ఐదు హామీల్ని అమలుకు అవసరమైన నిధుల్ని ఖర్చు చేయటం అసాధ్యమని తాను అనుకోవటం లేదన్న సిద్ధూ.. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోకుండా అన్ని పథకాల్ని అమలు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. రాష్ట్రం చేసిన అప్పునకు వడ్డీ రూపంలో రూ.56వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు.. ప్రజలకు ఇచ్చిన మాటకు తగ్గట్లు.. రూ.50వేలకోట్లు ఖర్చు చేయలేమా? అని పేర్కొన్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తో పాటు.. ఎమ్మెల్యేలంతా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. సీఎం సిద్ధూ సంతకం చేసిన ఐదు ఎన్నికల హామీలు ఏమంటే..
This post was last modified on May 21, 2023 4:01 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…