Political News

ముందు ఉట్టికెక్కుదాం.. తర్వాతే స్వర్గానికి…

ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతుందన్నది పాత సామెత. ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఆ సామెతను గుర్తు చేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత నేల విడిచి సాము చేస్తే తమకు కూడా బీజేపీకి పట్టిన గతే పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అర్థం చేసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పోటీ పెట్టకుండా తెలివిగా పరువు కాపాడుకున్న కేసీఆర్, సమీప భవిష్యత్తులో కూడా ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ లెక్కలేసుకున్నారట. జేడీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుందని అనుకున్నారట. ఆ రెండు పనులు జరగకపోవడంతో ఇప్పుడు కేసీఆర్ కు తత్వం బోధపడింది. ఇప్పుడిక ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టేకంటే స్వరాష్ట్రం తెలంగాణలో ఓడిపోకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని బీఆర్ఎస్ డిసైడైంది. అందుకే ఈ ఏడాది ఆఖరు వరకు మహారాష్ట్రలో కూడా స్పీడు తగ్గించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకటి రెండు కార్యక్రమాలు మినహా మేజర్ ఈవెంట్లు ఏవీ పెట్టుకోకూడదని కేసీఆర్ తన అనుచరులకు ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ముందు ఎలాంటి పొరబాట్లు జరిగినా అది విపక్షాలకు అడ్వాండేజ్ గా మారుతుందని బీఆర్ఎస్ భయపడుతుంది..

బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు (బుధవారం) కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను జూన్ 2 నుంచి నిర్వహించాల్సిన తరుణంలో దానిపై కార్యక్రమాల రూపకల్పనకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినప్పటికీ…. అసలు అజెండా వేరే ఉందని తేలిపోయింది. 20 రోజుల్లో రెండో సారి జరుగుతున్న సమావేశంలో అవినీతిపరులకు మరో సారి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సూచనలు కూడా కేసీఆర్ వైపు నుంచి రావచ్చని చెబుతున్నారు…

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago