Political News

కర్ణాటక ఎన్నికల తరువాత కేసీఆరే టార్గెట్

కర్ణాటక ఎన్నికల పనులు ఒకటి రెండు రోజుల్లో ముగుస్తాయి. తెలుగు నేతలకు జాతీయ పార్టీలు అప్పగించిన కర్ణాటక బాధ్యతలు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయి. బీజేపీ ఇక పై తెలంగాణను సీరియస్ గా తీసుకోవాలనుకుంటోంది. అధిష్టానం ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెడుతోంది. కార్యకర్తలు నేతలు నిత్యం జనంలో ఉండే కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతోంది..

కమలం పార్టీ తెలంగాణలో మొదలుపెట్టి ఆగిపోయిన నిరుద్యోగ మార్చ్ ను మళ్లీ నిర్వహించబోతోంది. ఈ నెల 11న అంటే కర్ణాటక పోలింగ్ జరిగిన మరుసటి రోజున నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నట్లు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగులు, ప్రజాస్వామ్యవాదులంతా తరలి వచ్చి మార్చ్ ను జయప్రదం చేయాలని ఆయన కోరుతున్నారు.

నిరుద్యోగ మార్చ్ లో అనేక డిమాండ్లను ప్రస్తావించబోతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలన్న బీజేపీ ప్రధాన డిమాండ్. స్కాంకు బాధ్యుడైన ఐటీ శాఖామంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలన్నది రెండో డిమాండ్. పరీక్షల రద్దుతో ప్రతీ నిరుద్యోగికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలన్నది మూడో డిమాండ్, బీఆర్ఎస్ ఎన్నిల హామీలో ఒకటైన నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలన్నది నాలుగో డిమాండ్

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉండే కార్యాచరణను బీజేపీ సిద్దంగా ఉంచుుకుంది. తొలుత ఈ నెల 11న సంగారెడ్డితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తారు. తర్వాత అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మార్చ్ ఉంటుంది. ఆ పని పూర్తయిన తర్వాత హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తారు. అంటే పది లక్షల మంది ఈ మార్చ్ లో పాల్గొంటారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ పలికిన బీఆర్ఎస్ ఇంతవరకు చేసిందేమీ లేదు. తాము అధికారానికి వచ్చిన తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల ప్రక్రియ మొదలవుతుందని బీజేపీ ప్రకటించింది…

This post was last modified on May 8, 2023 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago