ఏడేళ్ల ముందు సంగతి. లోకనాయకుడు కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమాను థియేట్రికల్ రిలీజ్తో పాటు డీటీహెచ్ల ద్వారా ఇళ్లలోనూ రిలీజ్ చేయాలని చూశారు. తన సినిమా విడుదలకు కొన్ని అడ్డంకులు ఎదురు కావడం, దీంతో పాటు తమిళనాట థియేటర్ల విషయంలో మోనోపలీ నడుస్తుండటంతో దానికి చెక్ పెట్టేందుకు ఈ ఆలోచన చేశారు కమల్. డీటీహెచ్లో సినిమా చూసేందుకు నిర్ణీత ధర పెట్టి.. నేరుగా తొలి రోజే టీవీల్లో సినిమా చూసే అవకాశం కల్పించాలనుకున్నారాయన. సినిమాను రికార్డ్ చేసుకునే, పైరసీ చేసే అవకాశం లేకుండా ఏదో ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు. ఐతే కమల్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో కమల్ తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
ఐతే ఆ తర్వాత ఈ తరహా ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఐతే కమల్ ఆలోచనను ఇప్పుడు అమల్లో పెట్టడానికి మంచి అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు నెల కిందట్నుంచి మూత పడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలించినా.. థియేటర్లకు ఇప్పుడిప్పుడే అవకాశం ఇవ్వరంటున్నారు. ఇంకో ఆరు నెలల తర్వాత కానీ థియేటర్లు తెరుచుకోవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ చేసే విషయంలో చర్చలు నడుస్తున్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి రికవర్ కాదు. ఒకసారి ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తర్వాత థియేట్రికల్ రిలీజ్కు అవకాశం లేనట్లే. జనాలు థియేటర్లకు రారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్ల ద్వారా ‘పే పర్ వ్యూ’ తరహాలో ఒక రేటు పెట్టి సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ముందు ఇలా రిలీజ్ చేసి కొంత ఆదాయం రాబట్టుకున్నాక.. ఓటీటీలతో ఒక రేటు మాట్లాడి వాటిలో సినిమాను పెట్టేస్తే పెట్టుబడి రికవర్ చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఈ ఆలోచన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదేమో.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…