ఏడేళ్ల ముందు సంగతి. లోకనాయకుడు కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమాను థియేట్రికల్ రిలీజ్తో పాటు డీటీహెచ్ల ద్వారా ఇళ్లలోనూ రిలీజ్ చేయాలని చూశారు. తన సినిమా విడుదలకు కొన్ని అడ్డంకులు ఎదురు కావడం, దీంతో పాటు తమిళనాట థియేటర్ల విషయంలో మోనోపలీ నడుస్తుండటంతో దానికి చెక్ పెట్టేందుకు ఈ ఆలోచన చేశారు కమల్. డీటీహెచ్లో సినిమా చూసేందుకు నిర్ణీత ధర పెట్టి.. నేరుగా తొలి రోజే టీవీల్లో సినిమా చూసే అవకాశం కల్పించాలనుకున్నారాయన. సినిమాను రికార్డ్ చేసుకునే, పైరసీ చేసే అవకాశం లేకుండా ఏదో ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు. ఐతే కమల్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో కమల్ తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
ఐతే ఆ తర్వాత ఈ తరహా ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఐతే కమల్ ఆలోచనను ఇప్పుడు అమల్లో పెట్టడానికి మంచి అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు నెల కిందట్నుంచి మూత పడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలించినా.. థియేటర్లకు ఇప్పుడిప్పుడే అవకాశం ఇవ్వరంటున్నారు. ఇంకో ఆరు నెలల తర్వాత కానీ థియేటర్లు తెరుచుకోవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ చేసే విషయంలో చర్చలు నడుస్తున్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి రికవర్ కాదు. ఒకసారి ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తర్వాత థియేట్రికల్ రిలీజ్కు అవకాశం లేనట్లే. జనాలు థియేటర్లకు రారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్ల ద్వారా ‘పే పర్ వ్యూ’ తరహాలో ఒక రేటు పెట్టి సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ముందు ఇలా రిలీజ్ చేసి కొంత ఆదాయం రాబట్టుకున్నాక.. ఓటీటీలతో ఒక రేటు మాట్లాడి వాటిలో సినిమాను పెట్టేస్తే పెట్టుబడి రికవర్ చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఈ ఆలోచన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on April 23, 2020 10:56 pm
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…