ఏడేళ్ల ముందు సంగతి. లోకనాయకుడు కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమాను థియేట్రికల్ రిలీజ్తో పాటు డీటీహెచ్ల ద్వారా ఇళ్లలోనూ రిలీజ్ చేయాలని చూశారు. తన సినిమా విడుదలకు కొన్ని అడ్డంకులు ఎదురు కావడం, దీంతో పాటు తమిళనాట థియేటర్ల విషయంలో మోనోపలీ నడుస్తుండటంతో దానికి చెక్ పెట్టేందుకు ఈ ఆలోచన చేశారు కమల్. డీటీహెచ్లో సినిమా చూసేందుకు నిర్ణీత ధర పెట్టి.. నేరుగా తొలి రోజే టీవీల్లో సినిమా చూసే అవకాశం కల్పించాలనుకున్నారాయన. సినిమాను రికార్డ్ చేసుకునే, పైరసీ చేసే అవకాశం లేకుండా ఏదో ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు. ఐతే కమల్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో కమల్ తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
ఐతే ఆ తర్వాత ఈ తరహా ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఐతే కమల్ ఆలోచనను ఇప్పుడు అమల్లో పెట్టడానికి మంచి అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు నెల కిందట్నుంచి మూత పడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలించినా.. థియేటర్లకు ఇప్పుడిప్పుడే అవకాశం ఇవ్వరంటున్నారు. ఇంకో ఆరు నెలల తర్వాత కానీ థియేటర్లు తెరుచుకోవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ చేసే విషయంలో చర్చలు నడుస్తున్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి రికవర్ కాదు. ఒకసారి ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తర్వాత థియేట్రికల్ రిలీజ్కు అవకాశం లేనట్లే. జనాలు థియేటర్లకు రారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్ల ద్వారా ‘పే పర్ వ్యూ’ తరహాలో ఒక రేటు పెట్టి సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ముందు ఇలా రిలీజ్ చేసి కొంత ఆదాయం రాబట్టుకున్నాక.. ఓటీటీలతో ఒక రేటు మాట్లాడి వాటిలో సినిమాను పెట్టేస్తే పెట్టుబడి రికవర్ చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఈ ఆలోచన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on April 23, 2020 10:56 pm
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…