2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ మెట్టు దిగి ప్రధాని మోదీతో మాట్లాడతారా.. గతాన్ని మరిచి రాజీకి రెండు పార్టీలు సిద్ధమవుతాయా. చాలా కాలంగా వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ అధినేత స్వయంగా సమాధానమిచ్చారు. నేరుగా ఆ మాట చెప్పకుండానే పొత్తుకు పచ్చజెండా ఊపారు..
రిపబ్లిక్ టీవీ చర్చావేదికలో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లుగానే మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు.
ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా..? అనే అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానమే ఇచ్చారు.
నిజానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం ద్వారా మనం మనం ఒకటేనని చంద్రబాబు సందేశమిచ్చారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో..తాను అదే ధోరణిలో ఆలోచిస్తున్నానని చెప్పారు. ప్రధాని విజనుతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు.
దేశానిభివృద్ధి కోసం.. తెలుగువాళ్లం కోసం తన పరిధిలో పనిచేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. భారతదేశ బలమేంటో.. ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్గా మారిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పట్లో పోరాడిన మాట నిజమేనని అంగీకరించారు. ఏదేమైనా అపోహలు తొలిగిపోయి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నందుకు ఇరు పార్టీల కార్యకర్తలు సంతోష పడుతున్నారు.
This post was last modified on April 25, 2023 5:33 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…