టాలీవుడ్లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో రవితేజ ఒకడు. ‘రాజా ది గ్రేట్’కు ముందు మాత్రమే ఆయన కెరీర్లో ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది. దానికి ముందు తర్వాత ఏడాదికి రెండుకు తక్కువ కాకుండా రిలీజ్లు ఉండేవి.
గత ఏడాది క్రాక్, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో పలకరించాడు మాస్ రాజా. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.
దీని తర్వాత రవితేజ చేయబోయే ఓ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. దర్శకుల ట్రాక్ రికార్డు, రేంజ్ చూడకుండా సినిమాలు చేసే రవితేజ.. తన కొత్త సినిమా విషయంలోనూ అలాగే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘కలర్ ఫొటో’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్తో రవితేజ జట్టు కట్టనున్నాడట. ‘కలర్ ఫొటో’ తర్వాత సందీప్ ఏ ఫీచర్ ఫిలిం తీయలేదు. ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వెబ్ సిరీస్కు క్రియేటర్గా వ్యవహరించాడు. అలాగే ‘ముఖచిత్రం’ అనే సినిమాకు స్క్రిప్టు అందించాడు.
ఇవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఐతే ఈసారి అతను మాస్ రాజానే మెప్పించే కథ రెడీ చేశాడు. ఈ కథ వైవిధ్యంగా ఉంటూనే రవితేజ మార్కును వినోదానికి ఇందులో ఆస్కారం ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రవితేజ మిడిలేజ్డ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడట. మాస్ రాజా లెక్చరర్ అనగానే ‘మిరపకాయ్’ గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు.
అలాగే ఇది కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో యువ కథానాయకులు చేయగల ప్రత్యేక పాత్రలు కూడా ఉన్నాయట. ఆ పాత్రలకు సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్, శర్వానంద్ లాంటి వాళ్లను కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on April 25, 2023 5:35 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…