టాలీవుడ్లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో రవితేజ ఒకడు. ‘రాజా ది గ్రేట్’కు ముందు మాత్రమే ఆయన కెరీర్లో ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది. దానికి ముందు తర్వాత ఏడాదికి రెండుకు తక్కువ కాకుండా రిలీజ్లు ఉండేవి.
గత ఏడాది క్రాక్, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో పలకరించాడు మాస్ రాజా. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.
దీని తర్వాత రవితేజ చేయబోయే ఓ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. దర్శకుల ట్రాక్ రికార్డు, రేంజ్ చూడకుండా సినిమాలు చేసే రవితేజ.. తన కొత్త సినిమా విషయంలోనూ అలాగే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘కలర్ ఫొటో’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్తో రవితేజ జట్టు కట్టనున్నాడట. ‘కలర్ ఫొటో’ తర్వాత సందీప్ ఏ ఫీచర్ ఫిలిం తీయలేదు. ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వెబ్ సిరీస్కు క్రియేటర్గా వ్యవహరించాడు. అలాగే ‘ముఖచిత్రం’ అనే సినిమాకు స్క్రిప్టు అందించాడు.
ఇవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఐతే ఈసారి అతను మాస్ రాజానే మెప్పించే కథ రెడీ చేశాడు. ఈ కథ వైవిధ్యంగా ఉంటూనే రవితేజ మార్కును వినోదానికి ఇందులో ఆస్కారం ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రవితేజ మిడిలేజ్డ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడట. మాస్ రాజా లెక్చరర్ అనగానే ‘మిరపకాయ్’ గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు.
అలాగే ఇది కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో యువ కథానాయకులు చేయగల ప్రత్యేక పాత్రలు కూడా ఉన్నాయట. ఆ పాత్రలకు సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్, శర్వానంద్ లాంటి వాళ్లను కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on April 25, 2023 5:35 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…