Political News

భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ లో సీబీఐ చెప్పిందేంటి?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్నున్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన వేళ.. సీబీఐ తమ దర్యాప్తులో తేలిన అంశాలు ఇవేనంటూ కోర్టు ముందు పెట్టింది. సీబీఐ అధికారుల కస్టడీ పిటిషన్ లో కీలక అంశాల్ని పేర్కొన్నారు. తమకు భాస్కర్ రెడ్డిని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. ఇంతకూ కస్టడీ పిటిషన్ లో సీబీఐ ఏం చెప్పింది? అన్న విషయాల్లోకి వెళితే..

  • వివేకానంద రెడ్డిపై కడప ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు ఈర్షగా ఉండేవారు. భాస్కర్ రెడ్డి ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకంగా ఉండేవారు. తమ కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేది. వివేకాను వారు శత్రువులగా చూసే వారు.
  • వివేకా నిర్ణయాల్ని విమర్శించే సాహసం మాత్రం చేసేవారు కాదు. భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిల ఈర్షకు ఇవన్నీ కారణాలే. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పని చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత వివేకా ఒక రోజు అవినాశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను మీరు మోసం చేశారు. నాకన్ని విషయాలు తెలిశాయి. మీ అందరి కథ చెబుతా అంటూ భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వీరి మధ్య విభేదాలు పెరిగాయి.
  • వివేకా తమకు వార్నింగ్ ఇవ్వటంతో ఆయన్ను హత్య చేయటానికి భాస్కర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలు కుట్ర పన్నారు. కడప ఎంపీ టికెట్ అవినాశ్ రెడ్డికి కాకుండా షర్మిలకు కానీ విజయమ్మకు కానీ ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానంద ఆకాంక్షించేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అవినాశ్ రెడ్డి హత్య చేయించి ఉంటారన్న అనుమానం ఉంది.
  • హత్యలో కీలక నిందితుడైన దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పిన అంశాలేమంటే..
  • వివేకా హత్యకు ప్లానింగ్ ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో 2019 ఫిబ్రవరి 10న జరిగింది. ఈ హత్యతో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. దీని వెనుక వైఎస్ భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డి.. మనోహర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డి లాంటి పెద్దవారు ఉన్నారు.
  • వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. ఇందులో రూ.5 కోట్లు నీకు వాటాగా ఇస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి చెప్పారు.
  • వివేకాను చంపాలని చెప్పిన రెండు.. మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ నాకు రూ.కోటి ఇచ్చారు. ఆ డబ్బులు ఎక్కడివి అంటే.. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డికి ఇచ్చాడు. ఆయన నాకిస్తే.. నేను నీకిస్తున్నా అని సునీల్ యాదవ్ చెప్పాడు.
  • వివేకాను హత్య చేయాలా? వద్దా? అని సునీల్ యాదవ్ ను సంప్రదించా. నన్ను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన శివశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడు. నాతో మాట్లాడించాడు. ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయ్. మేం ఉన్నామని చెప్పాం కదా? మళ్లీ అనుమానం ఎందుకు? అని శివశంకర్ రెడ్డి ప్రశ్నించారు.
  • హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల వేళలో నన్ను.. మిగిలిన వారిని గంగిరెడ్డి ఇంటికి పిలిచారు. మీరేమీ భయపడొద్దన్నారు. శివశంకర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిలతో మాట్లాడాను. అంతా వారు చూసుకుంటామని చెప్పారు. మీకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పారు.

హత్య జరిగిన రోజు ఏమైంది?

  • హత్యకు కొన్ని గంటల ముందు కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్.. పులివెందులలోని వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ ఇంట్లోనే ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా తేలింది. ఫోరెన్సిక్ విశ్లేషణలోనూ ఇదే విషయం నిర్దారణైంది.
  • వివేకాను చంపేందుకు గొడ్డలి కొనటానికి కదిరి వెళ్లిన దస్తగిరి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పులివెందులకు చేరుకున్నాడు. అప్పటికే అతని కోసం ఎదురుచూస్తున్న సునీల్ యాదవ్ కలిశాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వైఎస్ భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లను ఆఫ్ చేశారు.
  • సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేకాను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ పలుమార్లు భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఇంటికి పదే పదే తిరిగారు.

హత్య తర్వాతేమైంది?

  • హత్య తర్వాత నిందితులు (శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి) భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నారు. వేరే వ్యక్తుల ద్వారా వివేకా మరణం గురించి సమాచారం తెలుసుకోవలని.. ఆ తర్వాత అక్కడకు చేరుకోవటానికి వీలుగా వెయిట్ చేశారు.
  • మరణ వార్త అందుకున్నంతనే ఆధారాలు.. సాక్ష్యాలు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. వివేకా మరణించారని.. ఆయన పీఏ క్రిష్ణారెడ్డి చెప్పగానే.. అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పుడే భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు.
  • హత్య చేసి గుండెపోటుగా ప్రచారం చేయటం.. రక్తపు మరకల్ని చెరిపేయటం.. డెడ్ బాడీ మీద ఉన్న గాయాలకు బ్యాండేజీ కట్టటం.. ఫ్రీజర్ బాక్సును తెప్పించటం..ప్రజలు చూసేందుకు పూలతో అలంకరించటం.. లాంటివి హత్య కుట్రను దాచేందుకే జరిగాయి.
  • కేసును గుండెపోటు మరణంగా మేనేజ్ చేయాలని ఇన్ స్పెక్టర్ శంకరయ్యను బెదిరించారు. వివేకాది గుండెపోటు మరణంగా ప్రజల్నినమ్మించేందుకు భాస్కర్ రెడ్డితో పాటు అతడి అనుచరులు ప్రయత్నించారు.
  • వివేకా హత్యను సహజ మరణంగా చూపించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాల్ని ధ్వంసం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం వైఎస్ భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిల డైరెక్షన్ లోనే జరిగింది. ఆధారాల్ని ధ్వంసం చేసే సమయంలో ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు భాస్కర్ రెడ్డి లోపలి నుంచి తలుపులు వేశారు.
  • తలుపు వద్దే ఉన్న భాస్కర్రెడ్డి.. రక్తం మరకల్ని శుభ్రం చేయించారు. గాయాలకు కట్లు.. బ్యాండేజీలు వేసే సిబ్బందిని మాత్రమే అనుమతించారు. ఆ టైంలో అవినాశ్ రెడ్డి రెండు.. మూడుసార్లు లోపలకు వెళ్లి బయటకు వచ్చారు. గాయాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు డెడ్ బాడీ చుట్టూ బ్యాండేజీలతో కట్టుకట్టారు. ఫ్రీజర్ లో ఉంచి పూలతో అలంకరించారు. ఆ తర్వాత డెడ్ బాడీని ఆసుపత్రికి పంపారు. ఇవన్నీ హత్య కుట్రను దాచటానికే చేసిన ప్రయత్నాలే.
Satya

Recent Posts

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

4 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

7 hours ago

ఆర్సీ 17… చెప్పనన్న సుకుమార్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…

7 hours ago

చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…

8 hours ago

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

9 hours ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

10 hours ago