బాక్సాఫీస్ వద్ద దసరా బ్లాక్ బస్టర్ రన్ మూడో వారంలోనూ కొనసాగుతోంది. దీని తర్వాత ఒక్కటంటే ఒక్కటి సరైన మాస్ సినిమా రాకపోవడంతో నాని పంట మాములుగా పండలేదు. ఇరవై రోజులకు దగ్గరగా ఉన్నా చాలా చోట్ల వసూళ్లు స్టడీగా ఉన్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పందన ట్విట్టర్ లో చెప్పాడు. అద్భుతంగా ఉందని, నాని కీర్తి సురేష్ ల నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇతర సాంకేతిక వర్గం పనితనం గొప్పగా ఆవిష్కరింపబడిందని ప్రశంసించాడు. నాలుగో వారంలో అడుగు పెట్టబోతున్న దసరా బృందానికి ఇది జోష్ ఇచ్చేదే.
బాగానే ఉంది కానీ ఈ శుభాకాంక్షలేవో కాస్త ముందు చెప్పి ఉంటే కలెక్షన్లకు ఉపయోగపడేదని నాని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మొన్న వచ్చిన శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. విడుదల పార్ట్ 1కు ప్రశంసలు వచ్చాయి కానీ ఆ మోతాదులో వసూళ్లు లేవు. రుద్రుడు ఫస్ట్ షోకే వాషౌట్ అని క్లారిటీ వచ్చింది. సో ఆడియన్స్ కున్న ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ దసరా మాత్రమే. కాబట్టి ఈ టైంలో బన్నీ విషెస్ ఖచ్చితంగా ప్లస్ అయ్యేవే. తిరిగి 21 శుక్రవారం విరూపాక్ష, కిసీకా భాయ్ కిసీకా జాన్ వచ్చే దాకా ఇదే రన్ కొనసాగే అవకాశాలున్నాయి. కాబట్టి నో టెన్షన్.
దసరా తొలుత ఏపి నెమ్మదించిందనే వార్తలు వచ్చినప్పటికీ క్రమంగా ఇప్పుడు అక్కడా పికప్ కనిపిస్తోంది. కొత్తగా మళ్ళీ ఈవెంట్లు చేసే ఆలోచన లేకపోయినా జరుగుతున్న పరిణామాలు చూసి మరో వేడుక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా సమాచారం. ఫ్రైడే రిలీజుల ఫలితాలు చూశాక అప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు. పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ కాస్త బ్రేక్ దొరికాక దసరా చూశాడట. ఇందులో సుకుమార్ రికమండేషన్ ఉందని వినికిడి. మొత్తానికి సెలబ్రిటీలతోనూ శభాష్ అనిపించుకుంటున్న దసరా ఫైనల్ ఫిగర్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
This post was last modified on April 17, 2023 2:25 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…