Political News

భాస్క‌ర‌రెడ్డి అరెస్టుపై వైసీపీలో త‌లో మాట‌!

సీఎం జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. పులివెందులలోని ఆయ‌న నివాస గృహంలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. వెంట‌నే ఆయ‌న‌ను పులివెందుల నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అక్క‌డ నుంచి సీబీఐ న్యాయ‌మూర్తి ఇంటికి త‌రలించారు. దీంతో విచారించిన న్యాయ‌మూర్తి.. భాస్క‌ర‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.దీంతో ఆయ‌న‌ను చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. అయితే.. భాస్క‌ర‌రెడ్డి అరెస్టుపై వైసీపీ నేత‌లు కిక్కురు మ‌న‌లేదు.

భాస్క‌ర‌రెడ్డి అరెస్టుపై ఇద్ద‌రే ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు రియాక్ట్ అయ్యారు. అయితే.. వారు కూడా త‌ల‌కోమాట మాట్లాడ‌డంతో విస్మ‌యం వ్య‌క్త‌మైంది. మంత్రి ఆదిమూల‌పు సురేష్ భాస్క‌ర‌రెడ్డి అరెస్టుపై స్పందిస్తూ.. వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోంద‌ని అన్నారు. అంతేకాదు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. ఎవ‌రైనా ఎంత‌టి వారైనా చ‌ట్టం ముందు స‌మానులేన‌ని అన్నారు. సీఎం జగనే కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారని సురేష్ వ్యాఖ్యానించారు. వివేకాను దారుణంగా చంపిన దోషులు ఎవరైతే ఉన్నారో బయటకు రావాల్సిందేన‌ని మంత్రి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. క‌డ‌ప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీనికి భిన్నంగా స్పందించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమమ‌ని ఆయ‌న చెప్పారు. దర్యాప్తు సంస్థలు నిజాయితీగా విచారణ జరపాలని.. కానీ, ఇక్క‌డ అలాంటిదేమీ క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వివేకా హత్యకేసులో దోషులను కాకుండా.. అవినాష్ రెడ్డి కుటుంబాన్ని సీబీఐ టార్గెట్ చేసిందన్నారు. హత్యకు కారణం రాజకీయమా.. ఆర్థిక లావాదేవీలా, విహేతర సంబంధం, రెండో వివాహం హత్యకు కారణామా.,? ఇలా ఏ ఒక్క కోణంలోనూ దర్యాప్తు సంస్థలు విచారించడం లేద‌ని రాచ‌మ‌ల్లు నిప్పులు చెరిగారు. ఇలా.. వైసీపీ నాయ‌కులే త‌ల‌కోర‌కంగా మాట్లాడడంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on April 17, 2023 6:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago