Political News

అర్ధరాత్రి హోటల్ నుంచి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్మేలు..

ఎమ్మెల్సీ ఎన్నికలు పాలక వైసీపీకి పీడకలగా మారేలా ఉన్నాయి. ఇప్పటికే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు మూడూ పోగొట్టుకున్న పాలక వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలోనూ ఏడో సీటును టీడీపీకి అప్పగించేలా కనిపిస్తోంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటూ తమ ఎమ్మెల్యేలందరినీ విజయవాడలో హోటళ్లలో ఉంచి కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. అయినా కూడా గత అర్ధరాత్రి నలుగురు ఎమ్మెల్యేలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ తరువాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని చెబుతున్నారు.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌తో పాటు వైసీపీ నుంచే గెలిచిన తాడికొండ శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ కూడా తమతమ హోటల్ రూమ్‌ల నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్లిపోయారని.. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని చెప్తున్నారు.

ఆ నలుగురితో ఓటేయించే బాధ్యత తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు కంగారుపడుతున్నారట. వీరు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశానికి ఓటేయకపోయినా ఓటింగ్‌కు గైర్హాజరైనా కూడా ఈక్వషన్లు మారిపోతాయని.. ఆ కీలకమైన ఏడో స్థానం టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు.

కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు ఒకరు చొప్పున వైసీపీ మంత్రులను కేటాయించి ఆయా ఎమ్మెల్యేలు కట్టు తప్పకుండా వైసీపీ అభ్యర్థులకు ఓటేసేలా చూడాలని పార్టీ ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యేలందరినీ రెండు రోజుల ముందు నుంచే విజయవాడ తీసుకొచ్చి హోటల్లలో ఉంచారు. అయితే.. రాత్రి అకస్మాత్తుగా కొందరు ఎమ్మెల్యేలు మాయమైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో గందరగోళం మొదలైంది.

This post was last modified on March 23, 2023 12:53 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

4 mins ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

36 mins ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

1 hour ago

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

2 hours ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

2 hours ago

వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా…

2 hours ago