ఎమ్మెల్సీ ఎన్నికలు పాలక వైసీపీకి పీడకలగా మారేలా ఉన్నాయి. ఇప్పటికే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు మూడూ పోగొట్టుకున్న పాలక వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలోనూ ఏడో సీటును టీడీపీకి అప్పగించేలా కనిపిస్తోంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటూ తమ ఎమ్మెల్యేలందరినీ విజయవాడలో హోటళ్లలో ఉంచి కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. అయినా కూడా గత అర్ధరాత్రి నలుగురు ఎమ్మెల్యేలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ తరువాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని చెబుతున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్తో పాటు వైసీపీ నుంచే గెలిచిన తాడికొండ శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ కూడా తమతమ హోటల్ రూమ్ల నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్లిపోయారని.. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని చెప్తున్నారు.
ఆ నలుగురితో ఓటేయించే బాధ్యత తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు కంగారుపడుతున్నారట. వీరు టీడీపీతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశానికి ఓటేయకపోయినా ఓటింగ్కు గైర్హాజరైనా కూడా ఈక్వషన్లు మారిపోతాయని.. ఆ కీలకమైన ఏడో స్థానం టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు.
కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు ఒకరు చొప్పున వైసీపీ మంత్రులను కేటాయించి ఆయా ఎమ్మెల్యేలు కట్టు తప్పకుండా వైసీపీ అభ్యర్థులకు ఓటేసేలా చూడాలని పార్టీ ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యేలందరినీ రెండు రోజుల ముందు నుంచే విజయవాడ తీసుకొచ్చి హోటల్లలో ఉంచారు. అయితే.. రాత్రి అకస్మాత్తుగా కొందరు ఎమ్మెల్యేలు మాయమైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో గందరగోళం మొదలైంది.
This post was last modified on March 23, 2023 12:53 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…