‘ఛలో’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకీ కుడుముల. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర అంతకుముందు శిష్యరికం చేసి దర్శకుడిగా పేరు సంపాదించిన ఎవ్వరూ ఇండస్ట్రీలో లేని నేపథ్యంలో త్రివిక్రమ్ అసిస్టెంట్ అనే ముద్రతో దర్శకుడిగా మారిన వెంకీ మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ తొలి సినిమాను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్ది మంచి మార్కులు కొట్టేశాడు వెంకీ. ఆ తర్వాత ‘భీష్మ’తో ద్వితీయ విఘ్నాన్ని కూడా విజయవంతంగా దాటేశాడు. ‘ఛలో’ను మించి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
ఐతే అతడి మూడో సినిమా పట్టాలెక్కడానికి మాత్రం చాలా టైం పట్టేసింది. అలా అని అతనేమీ ఖాళీగా లేడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది అతడికి. ఆయన కోసం కష్టపడి ఒక స్క్రిప్టు తయారు చేశాడు. కానీ అది చివరికి చిరును మెప్పించలేదు. సినిమా క్యాన్సిలైంది.
దీంతో తిరిగి నితిన్తోనే సినిమా సెట్ చేసుకున్నాడు. ‘భీష్మ’లో కథానాయికగా నటించిన రష్మికనే ఇందులోనూ హీరోయిన్. ఈ ముగ్గురి కలయికలో కొత్త సినిమా గురించి అనౌన్స్మెంటే చాలా వెరైటీగా చేశారు. నితిన్, రష్మిక, సంగీత దర్శకుడు జీవీ కుమార్, వెంకీ కలిసి ఒకరి మీద ఒకరు.. అలాగే తమ మీదే తామే పంచులు వేసుకుంటూ భలే ఎంగేజ్ చేశారు ఈ వీడియోలో. సినిమా అనౌన్స్మెంటే చాలా క్రియేటివ్గా చేశారని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియో చూశాక చిరు ఫ్యాన్స్ ఒకింత బాధ పడుతున్న మాట వాస్తవం. ఓవైపు మెహర్ రమేష్ లాంటి ఔట్ డేటెడ్ డైరెక్టర్తో సినిమా చేస్తూ.. ఇలాంటి ట్రెండీ డైరెక్టర్తో చిరు సినిమా క్యాన్సిల్ చేయడమేంటి అనుకుంటున్నారు. చిరు పని చేస్తున్న ఏ దర్శకుడితో పోల్చుకున్నా వెంకీ వాళ్లకు బెటర్గానే కనిపిస్తున్నాడు. అతడికి ఇప్పటి యూత్ పల్స్ తెలుసు. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. కమర్షియల్ హంగులకు తన సినిమాల్లో లోటు ఉండదు. అలాంటి డైరెక్టర్తో సినిమా చేస్తే ఇప్పటి యూత్కు కనెక్ట్ అయ్యేలా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందించేవాడు. అతను మూడో సినిమాతో కూడా హిట్ కొట్టాడంటే మాత్రం చిరు పెద్ద తప్పు చేశాడని అందరూ ఫిక్సయిపోతారేమో.
This post was last modified on March 23, 2023 1:51 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…