దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఈడీ విచారిస్తుండడంతో ఈడీ కార్యాలయం దగ్గర హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా కవిత విచారణ ఉదయం 10 గంటల తరువాత మొదలుకానుంది. ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, మాజీ సీఏలను అరెస్టు చేశారు. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా దిల్లీకి వచ్చారు.
కవిత విచారణ, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో దిల్లీకి చేరుకోవడంతో ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో దిల్లీకి రావడంతో… ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆందోళనలు చేయొచ్చని.. నిరసనలు ఉద్ధృతం కావొచ్చన్న అంచనాలతోనే పెద్దఎత్తున కేంద్ర బలగాలు మోహరించారు.
మరోవైపు కవిత భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్తుండడంతో కార్యకర్తలను అదుపు చేసేందుకు కవిత ఇంటి నుంచి దారిలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. ర్యాలీకి పర్మిషన్ లేదని.. కవితతో పాటు మరో కారు మాత్రమే ఈడీ కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు అనౌన్స్ చేసినప్పటికీ కవిత ఇంటివద్ద కార్యకర్తల జోరుతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
This post was last modified on March 11, 2023 11:11 am
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…