దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఈడీ విచారిస్తుండడంతో ఈడీ కార్యాలయం దగ్గర హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా కవిత విచారణ ఉదయం 10 గంటల తరువాత మొదలుకానుంది. ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, మాజీ సీఏలను అరెస్టు చేశారు. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా దిల్లీకి వచ్చారు.
కవిత విచారణ, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో దిల్లీకి చేరుకోవడంతో ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో దిల్లీకి రావడంతో… ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆందోళనలు చేయొచ్చని.. నిరసనలు ఉద్ధృతం కావొచ్చన్న అంచనాలతోనే పెద్దఎత్తున కేంద్ర బలగాలు మోహరించారు.
మరోవైపు కవిత భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్తుండడంతో కార్యకర్తలను అదుపు చేసేందుకు కవిత ఇంటి నుంచి దారిలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. ర్యాలీకి పర్మిషన్ లేదని.. కవితతో పాటు మరో కారు మాత్రమే ఈడీ కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు అనౌన్స్ చేసినప్పటికీ కవిత ఇంటివద్ద కార్యకర్తల జోరుతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
This post was last modified on March 11, 2023 11:11 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…