ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రాణసంకటంగా పరిణమించాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జనసేన తమకంటే తమకే మద్దతు ఇస్తోందని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను, నేతలను కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు.
అంతేకాదు.. అవసరమైతే.. జనసేన నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలుపుకొని ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. అయితే.. జనసేన అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో జనసేన నాయకులు ఎవరూ కూడా.. టీడీపీతో కలిసి ముందుకు నడిచే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇక, మరోవైపు.. బీజేపీ కూడా.. తమకు మద్దతు జనసేనేనని.. పొత్తులో భాగంగా.. తమకు అనుకూలంగా జనసేన ఉంటుందని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతల సమావేశాల్లో బీజేపీ నేతలు.. ముఖ్యంగా బీజేపీ జాతీయకార్యదర్శి, ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్గా ఉన్న సునీల్ దేవ్ధర్ కూడా పవన్ పేరు ఎత్తకుండానే జనసేనతో కలిసి ముందుకు సాగాలని.. బీజేపీ పొత్తు జనసేనతోనే ఉందని అందుకే ఆ పార్టీ నాయకులను కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. దీంతో బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారని.. సోము వీర్రాజు కితాబు ఇచ్చారు.
అయితే.. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఇలా జనసేన కార్డును వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎవరికి మద్దతివ్వాలి.. అనేది మాత్రం చెప్పలేక పోతున్నారు. సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్గా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ వ్యూహం ఏంటనేది తెలియక మరోవైపు కార్యకర్తలు కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 10, 2023 10:00 am
పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…
2009 సెప్టెంబరులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ…
టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అనంతరం పశ్చిమ…
తెలంగాణ ప్రతిపక్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని వారాల కిందట కఠిన చర్యలు తీసుకున్న విషయం…
వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నారని.. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకోవడం లేదని..…
అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…