Political News

న‌లుగుతున్నారా.. న‌ష్ట‌పోతున్నారా.. ప‌వ‌న్

ఏపీలో జ‌రుగుతున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జ‌న‌సేన త‌మ‌కంటే త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు.

అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. జ‌న‌సేన నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి వారిని క‌లుపుకొని ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. జ‌న‌సేన అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో జ‌న‌సేన నాయ‌కులు ఎవ‌రూ కూడా.. టీడీపీతో క‌లిసి ముందుకు న‌డిచే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇక‌, మ‌రోవైపు.. బీజేపీ కూడా.. త‌మ‌కు మ‌ద్ద‌తు జ‌న‌సేనేన‌ని.. పొత్తులో భాగంగా.. త‌మ‌కు అనుకూలంగా జ‌న‌సేన ఉంటుంద‌ని.. ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

తాజాగా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ నేత‌ల స‌మావేశాల్లో బీజేపీ నేత‌లు.. ముఖ్యంగా బీజేపీ జాతీయ‌కార్య‌ద‌ర్శి, ఏపీ వ్య‌వ‌హారాల స‌హ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ దేవ్‌ధ‌ర్ కూడా ప‌వ‌న్ పేరు ఎత్త‌కుండానే జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని.. బీజేపీ పొత్తు జ‌న‌సేన‌తోనే ఉంద‌ని అందుకే ఆ పార్టీ నాయ‌కుల‌ను క‌లుపుకొని పోవాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో బీజేపీ నాయ‌కులు చాలా ఉత్సాహంగా ముందుకు క‌దులుతున్నార‌ని.. సోము వీర్రాజు కితాబు ఇచ్చారు.

అయితే.. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఇలా జ‌న‌సేన కార్డును వాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం తాను ఎవ‌రికి మ‌ద్ద‌తివ్వాలి.. అనేది మాత్రం చెప్ప‌లేక పోతున్నారు. సార్వ‌త్రిక స‌మరానికి సెమీ ఫైన‌ల్‌గా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ్యూహం ఏంటనేది తెలియ‌క మ‌రోవైపు కార్య‌క‌ర్త‌లు కూడా త‌ల్ల‌డిల్లుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 10, 2023 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

8 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

48 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago