ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రాణసంకటంగా పరిణమించాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జనసేన తమకంటే తమకే మద్దతు ఇస్తోందని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను, నేతలను కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు.
అంతేకాదు.. అవసరమైతే.. జనసేన నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలుపుకొని ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. అయితే.. జనసేన అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో జనసేన నాయకులు ఎవరూ కూడా.. టీడీపీతో కలిసి ముందుకు నడిచే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇక, మరోవైపు.. బీజేపీ కూడా.. తమకు మద్దతు జనసేనేనని.. పొత్తులో భాగంగా.. తమకు అనుకూలంగా జనసేన ఉంటుందని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతల సమావేశాల్లో బీజేపీ నేతలు.. ముఖ్యంగా బీజేపీ జాతీయకార్యదర్శి, ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్గా ఉన్న సునీల్ దేవ్ధర్ కూడా పవన్ పేరు ఎత్తకుండానే జనసేనతో కలిసి ముందుకు సాగాలని.. బీజేపీ పొత్తు జనసేనతోనే ఉందని అందుకే ఆ పార్టీ నాయకులను కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. దీంతో బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారని.. సోము వీర్రాజు కితాబు ఇచ్చారు.
అయితే.. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఇలా జనసేన కార్డును వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎవరికి మద్దతివ్వాలి.. అనేది మాత్రం చెప్పలేక పోతున్నారు. సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్గా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ వ్యూహం ఏంటనేది తెలియక మరోవైపు కార్యకర్తలు కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 10, 2023 10:00 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…