టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. పుణ్యక్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న లోకేష్ ను చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. అన్ని వర్గాల వారితో లోకేష్ సమావేశమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.టీడీపీ అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను అవినీతిని ఎండగడుతున్నారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు.
పనిలో పనిగా లోకేష్ స్థానిక సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నారు. నగరి యాత్రలో మంత్రి రోజాపై విమర్శలు సంధించారు. జబర్దస్ట్ ఆంటీ అంటూ కొత్త పేరు పెట్టేశారు. దానితో రోజా కాస్త గింజుకున్న మాట వాస్తవం. ఇప్పుడు తిరుపతి వచ్చే సరికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు.
ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి చీకటి దందాలతో తిరుపతి వాసులు విసిగిపోయారని లోకేష్ ఆరోపించారు. తండ్రి సాధు జీవిలా కనిపిస్తారని, కొడుకు వికృతజీవిగా మారిపోయారని ఆయన అన్నారు. తండ్రి కరుణాకర్ రెడ్డి మద్యం తాగొద్దని పైపైకి ప్రచారం చేస్తారని, తనయుడు అభినయ్ రెడ్డి లిక్కర్ సిండికేట్ నడుపుతారని లోకేష్ వెల్లడించారు.
ఇక అభినయ్ రెడ్డి గురించి లోకేష్ చాలా మాటలే చెప్పారు. తండ్రి కరుణాకర్ రెడ్డి నియోజకవర్గంలో అసలు గంజాయే లేదని చెబుతారని, కొడుకు అభినయ్ మాత్రం గంజాయి స్మగ్లింగ్ లో ఆరితేరారని లోకేష్ అంటున్నారు. బెదిరింపులు, వసూళ్లకు తనయుడు కేరాఫ్ అడ్రెస్ గా మారరన్నారు.
భూముల రిజిస్ట్రేషన్ లో కూడా అభినయ్ రెడ్డి దందా నడుపుతున్నారని లోకేష్ వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అభినయ్ రెడ్డి తన మనుషులను కూర్చోబెట్టారన్నారు. వారంతా అతని చిన్ననాటి స్నేహితులన్నారు. అభినయ్ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారన్నారు. అలా 2,300 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు లోకేష్ లెక్కతేల్చారు. వైసీపీ నేతలు మేక వన్నె పులుల్లా తయారై తెలుగు ప్రజలను దోచుకుంటున్నారు..
This post was last modified on February 26, 2023 9:44 am
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…