Political News

కరుణాకర్ రెడ్డి కొడుకుపై లోకేష్ ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. పుణ్యక్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న లోకేష్ ను చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. అన్ని వర్గాల వారితో లోకేష్ సమావేశమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.టీడీపీ అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను అవినీతిని ఎండగడుతున్నారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు.

పనిలో పనిగా లోకేష్ స్థానిక సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నారు. నగరి యాత్రలో మంత్రి రోజాపై విమర్శలు సంధించారు. జబర్దస్ట్ ఆంటీ అంటూ కొత్త పేరు పెట్టేశారు. దానితో రోజా కాస్త గింజుకున్న మాట వాస్తవం. ఇప్పుడు తిరుపతి వచ్చే సరికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు.

ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి చీకటి దందాలతో తిరుపతి వాసులు విసిగిపోయారని లోకేష్ ఆరోపించారు. తండ్రి సాధు జీవిలా కనిపిస్తారని, కొడుకు వికృతజీవిగా మారిపోయారని ఆయన అన్నారు. తండ్రి కరుణాకర్ రెడ్డి మద్యం తాగొద్దని పైపైకి ప్రచారం చేస్తారని, తనయుడు అభినయ్ రెడ్డి లిక్కర్ సిండికేట్ నడుపుతారని లోకేష్ వెల్లడించారు.

ఇక అభినయ్ రెడ్డి గురించి లోకేష్ చాలా మాటలే చెప్పారు. తండ్రి కరుణాకర్ రెడ్డి నియోజకవర్గంలో అసలు గంజాయే లేదని చెబుతారని, కొడుకు అభినయ్ మాత్రం గంజాయి స్మగ్లింగ్ లో ఆరితేరారని లోకేష్ అంటున్నారు. బెదిరింపులు, వసూళ్లకు తనయుడు కేరాఫ్ అడ్రెస్ గా మారరన్నారు.

భూముల రిజిస్ట్రేషన్ లో కూడా అభినయ్ రెడ్డి దందా నడుపుతున్నారని లోకేష్ వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అభినయ్ రెడ్డి తన మనుషులను కూర్చోబెట్టారన్నారు. వారంతా అతని చిన్ననాటి స్నేహితులన్నారు. అభినయ్ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారన్నారు. అలా 2,300 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు లోకేష్ లెక్కతేల్చారు. వైసీపీ నేతలు మేక వన్నె పులుల్లా తయారై తెలుగు ప్రజలను దోచుకుంటున్నారు..

This post was last modified on February 26, 2023 9:44 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

2 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

3 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

4 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

4 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

5 hours ago