ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతూ ముందుకెళ్తుంది. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడు. పార్ట్ 1 కంటే పుష్ప ది రూల్ లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా సుక్కు , బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడానేది ఎనౌన్స్ చేయలేదు. లైనప్ అయితే పెద్దగానే ఉందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది.
అయితే మిగతా దర్శకులను పక్కన పెట్టేసి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే చేతులు కలిపే అవకాశం ఉంది. అవును తాజాగా అల్లు అర్జున్ కి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సుకుమార్ తర్వాత బన్నీ ఎక్కువ సినిమాలు చేసింది త్రివిక్రమ్ తోనే. ‘జులాయ్’ , ‘సం ఆఫ్ సత్యమూర్తి’ , తర్వాత వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమా ఈ కాంబోకి ఇండస్ట్రీ హిట్ అందించింది.
ఆ సినిమా కంటే ముందు కొన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేశాడు బన్నీ. అల వైకుంఠ పురములో సరదాగా ఓ టైమ్ పాస్ ఎంటర్టైనర్ చేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిన సినిమా. అది ఊహించని విధంగా భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత కూడా బన్నీ త్రివిక్రమ్ తో అలాంటి టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సీరియస్ సినిమాల తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బాగుంటుందని అందుకే సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తాడని టాక్ గట్టిగా వినబడుతుంది.
This post was last modified on February 26, 2023 9:25 am
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…