ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతూ ముందుకెళ్తుంది. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడు. పార్ట్ 1 కంటే పుష్ప ది రూల్ లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా సుక్కు , బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడానేది ఎనౌన్స్ చేయలేదు. లైనప్ అయితే పెద్దగానే ఉందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది.
అయితే మిగతా దర్శకులను పక్కన పెట్టేసి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే చేతులు కలిపే అవకాశం ఉంది. అవును తాజాగా అల్లు అర్జున్ కి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సుకుమార్ తర్వాత బన్నీ ఎక్కువ సినిమాలు చేసింది త్రివిక్రమ్ తోనే. ‘జులాయ్’ , ‘సం ఆఫ్ సత్యమూర్తి’ , తర్వాత వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమా ఈ కాంబోకి ఇండస్ట్రీ హిట్ అందించింది.
ఆ సినిమా కంటే ముందు కొన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేశాడు బన్నీ. అల వైకుంఠ పురములో సరదాగా ఓ టైమ్ పాస్ ఎంటర్టైనర్ చేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిన సినిమా. అది ఊహించని విధంగా భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత కూడా బన్నీ త్రివిక్రమ్ తో అలాంటి టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సీరియస్ సినిమాల తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బాగుంటుందని అందుకే సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తాడని టాక్ గట్టిగా వినబడుతుంది.
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…