Movie News

త్రివిక్రమ్ తో బన్నీ ఫిక్సేనా ?

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతూ ముందుకెళ్తుంది. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడు. పార్ట్ 1 కంటే పుష్ప ది రూల్ లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా సుక్కు , బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడానేది ఎనౌన్స్ చేయలేదు. లైనప్ అయితే పెద్దగానే ఉందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది.

అయితే మిగతా దర్శకులను పక్కన పెట్టేసి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే చేతులు కలిపే అవకాశం ఉంది. అవును తాజాగా అల్లు అర్జున్ కి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సుకుమార్ తర్వాత బన్నీ ఎక్కువ సినిమాలు చేసింది త్రివిక్రమ్ తోనే. ‘జులాయ్’ , ‘సం ఆఫ్ సత్యమూర్తి’ , తర్వాత వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమా ఈ కాంబోకి ఇండస్ట్రీ హిట్ అందించింది.

ఆ సినిమా కంటే ముందు కొన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేశాడు బన్నీ. అల వైకుంఠ పురములో సరదాగా ఓ టైమ్ పాస్ ఎంటర్టైనర్ చేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిన సినిమా. అది ఊహించని విధంగా భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత కూడా బన్నీ త్రివిక్రమ్ తో అలాంటి టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సీరియస్ సినిమాల తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బాగుంటుందని అందుకే సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తాడని టాక్ గట్టిగా వినబడుతుంది.

This post was last modified on February 26, 2023 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago