ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతూ ముందుకెళ్తుంది. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడు. పార్ట్ 1 కంటే పుష్ప ది రూల్ లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా సుక్కు , బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడానేది ఎనౌన్స్ చేయలేదు. లైనప్ అయితే పెద్దగానే ఉందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది.
అయితే మిగతా దర్శకులను పక్కన పెట్టేసి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే చేతులు కలిపే అవకాశం ఉంది. అవును తాజాగా అల్లు అర్జున్ కి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సుకుమార్ తర్వాత బన్నీ ఎక్కువ సినిమాలు చేసింది త్రివిక్రమ్ తోనే. ‘జులాయ్’ , ‘సం ఆఫ్ సత్యమూర్తి’ , తర్వాత వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమా ఈ కాంబోకి ఇండస్ట్రీ హిట్ అందించింది.
ఆ సినిమా కంటే ముందు కొన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేశాడు బన్నీ. అల వైకుంఠ పురములో సరదాగా ఓ టైమ్ పాస్ ఎంటర్టైనర్ చేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిన సినిమా. అది ఊహించని విధంగా భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత కూడా బన్నీ త్రివిక్రమ్ తో అలాంటి టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సీరియస్ సినిమాల తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బాగుంటుందని అందుకే సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తాడని టాక్ గట్టిగా వినబడుతుంది.
This post was last modified on February 26, 2023 9:25 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…