తెలుగులో ఏ సూపర్ హిట్ కొట్టిన దర్శకుడిని అడిగినా నెక్స్ట్ మైత్రి కి ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్తాడు. ఇది కామన్. సినిమా టాక్ బయటికి రాగనే మైత్రి నిర్మాతలు ఆ దర్శకుడికి తర్వాత హీరోకి ఎడ్వాన్స్ లు ఇచ్చేసి డేట్స్ బ్లాక్ చేసుకుంటారు. అందుకే మైత్రి ఎడ్వాన్సులు ఎందరో దర్శకుల చేతిలో ఉంటాయి. చిన్న డైరెక్టర్ నుండి స్టార్ డైరెక్టర్ వరకూ మైత్రి ఎడ్వాన్సులు అందుకున్న దర్శకులెందరో ఉన్నారు. ఇప్పుడు మైత్రి తర్వాత అన్ని ఎడ్వాన్సులు ఇస్తూ అగ్ర సంస్థ ఎదిగే క్రమంలో ఉన్నది సీతారనే.
సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ మెల్ల మెల్లగా ఎదుగుతుంది. మొన్నటి వరకు ఈ బేనర్ లో మీడియం బడ్జెట్ సినిమాలు , చిన్న సినిమాలే వచ్చాయి. ‘భీమ్లా నాయక్’ తో ఈ బేనర్ బడా సంస్థ గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ నుండి దాదాపు పది మంది కుర్ర దర్శకులు ఎడ్వాన్సులు అందుకున్నారు. ముఖ్యంగా వెంకీ అట్లూరి , వివేక్ ఆత్రేయ, గౌతం తిన్ననూరి ఇలా నాగ వంశీ నుండి ఎడ్వాన్సులు తీసుకున్న లిస్టు చాలానే ఉంది. క్రేజీ హీరోల లైనప్ లో కూడా సితార ఉంది.
ప్రస్తుతం సార్ తో ఈ బేనర్ కి మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సక్సెస్ ఊపుతో సినిమా ప్రొడక్షన్ కౌంట్ పెంచే పనిలో ఉన్నాడు నిర్మాత నాగ వంశీ. ఈ బేనర్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలు నిర్మించే ప్లానింగ్ లో ఉన్నాడు. అందుకే సక్సెస్ కొట్టిన దర్శకులకు , ఫామ్ లో ఉన్న హీరోలకి ఎడ్వాన్సులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎక్కువ ఎడ్వాన్సులు ఇచ్చినా ఇబ్బందే. తాజాగా పరశురామ్ విషయంలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
This post was last modified on February 26, 2023 9:36 am
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…