Movie News

మైత్రి తర్వాత సితారనే !

తెలుగులో ఏ సూపర్ హిట్ కొట్టిన దర్శకుడిని అడిగినా నెక్స్ట్ మైత్రి కి ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్తాడు. ఇది కామన్. సినిమా టాక్ బయటికి రాగనే మైత్రి నిర్మాతలు ఆ దర్శకుడికి తర్వాత హీరోకి ఎడ్వాన్స్ లు ఇచ్చేసి డేట్స్ బ్లాక్ చేసుకుంటారు. అందుకే మైత్రి ఎడ్వాన్సులు ఎందరో దర్శకుల చేతిలో ఉంటాయి. చిన్న డైరెక్టర్ నుండి స్టార్ డైరెక్టర్ వరకూ మైత్రి ఎడ్వాన్సులు అందుకున్న దర్శకులెందరో ఉన్నారు. ఇప్పుడు మైత్రి తర్వాత అన్ని ఎడ్వాన్సులు ఇస్తూ అగ్ర సంస్థ ఎదిగే క్రమంలో ఉన్నది సీతారనే.

సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ మెల్ల మెల్లగా ఎదుగుతుంది. మొన్నటి వరకు ఈ బేనర్ లో మీడియం బడ్జెట్ సినిమాలు , చిన్న సినిమాలే వచ్చాయి. ‘భీమ్లా నాయక్’ తో ఈ బేనర్ బడా సంస్థ గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ నుండి దాదాపు పది మంది కుర్ర దర్శకులు ఎడ్వాన్సులు అందుకున్నారు. ముఖ్యంగా వెంకీ అట్లూరి , వివేక్ ఆత్రేయ, గౌతం తిన్ననూరి ఇలా నాగ వంశీ నుండి ఎడ్వాన్సులు తీసుకున్న లిస్టు చాలానే ఉంది. క్రేజీ హీరోల లైనప్ లో కూడా సితార ఉంది.

ప్రస్తుతం సార్ తో ఈ బేనర్ కి మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సక్సెస్ ఊపుతో సినిమా ప్రొడక్షన్ కౌంట్ పెంచే పనిలో ఉన్నాడు నిర్మాత నాగ వంశీ. ఈ బేనర్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలు నిర్మించే ప్లానింగ్ లో ఉన్నాడు. అందుకే సక్సెస్ కొట్టిన దర్శకులకు , ఫామ్ లో ఉన్న హీరోలకి ఎడ్వాన్సులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎక్కువ ఎడ్వాన్సులు ఇచ్చినా ఇబ్బందే. తాజాగా పరశురామ్ విషయంలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది.

This post was last modified on February 26, 2023 9:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago