మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా తేలిపోయింది. దానికి తగ్గట్టుగా రెండు మూడు రోజులుగా కన్నా..సత్తెనపల్లిలో తిరుగుతూ టీడీపీ నేతలందరినీ పలుకరిస్తున్నారు. పొరుగున ఉన్న పెద కూరపాడు నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించినప్పుడు సత్తెనపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు…
కన్నా రాకతో సత్తెనపల్లి టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారంతా ఇప్పుడు సైడైపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ముగ్గురు నలుగురు ఆశావహులు అక్కడ క్రియాశీలంగా ఉంటూ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు యువనేతలను నారా లోకేష్ బుజ్జగించి ఎన్నికల తర్వాత తగిన రీతిలో అవకాశాలిస్తామని చెప్పారట. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా కొంతకాలంగా సత్తెనపల్లిలో తిరుగుతూ అందరనీ కలుస్తున్నారు. ఒక అన్న క్యాంటిన్ ప్రారంభించి రోజూ 200 మందికి భోజనం పెడుతున్నారు. వైవీ ఆంజనేయులు ఇప్పుడు పునరాలోచనలో పడిపోయారు..
కోడెల శివరాం పరిస్థితి ఆగమ్యగోచరం
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. తండ్రి మరణం తర్వాత ఆయన టీడీపీ టికెట్ ఆశించారు. నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురు చూశారు. అయితే 2014 నుంచి 2019 మధ్య నియోజకవర్గంలో శివరాం అరాచకాలను చూసిన చంద్రబాబు ఆయన్ను దూరం పెట్టారు. ఇటీవలే శివరాం ఆయన్ను కలవడంతో ముందు పార్టీలో పనిచేయాలని, తర్వాతే టికెట్ గురించి ఆలోచించాలని చెప్పి పంపారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని కూడా ప్రకటించారు. కోడెలను లోకేష్ కూడా దూరం పెట్టారు. దానితో ఇప్పుడు కన్నా వస్తున్న తరుణంలో ఇక శివరాం ఖేల్ ఖతం అన్న వాదన వినిపిస్తోంది. వృత్తి రీత్యా కేన్సర్ వైద్యుడైన శివరాం.. తండ్రి మరణించిన తర్వాత ఫుల్ టైమ్ పార్టీపైనే దృష్టి పెట్టారు. కాకపోతే నిజంగా రాజకీయాల్లో కొనసాగాలంటే మాత్రం శివరాం మరో ఐదేళ్లు ఆగాల్సి ఉంటుంది..
సహకరిస్తారా… లేదా..
ముందు నుంచి టీడీపీలో క్రియాశీలంగా ఉంటున్న ఆశావహులంతా కన్నాకు సహకరిస్తారో లేదో చూడాలి. ఎందుకంటే పార్టీకి విజయవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఎమ్మెల్యే పదవిని ఆశిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం రాదన్న భయం వారిలో ఉందనే చెప్పాలి. పైగా ఇప్పటిదాకా వాళ్లు విపరీతంగా ఖర్చు పెట్టి కూడా ఉన్నారు…
This post was last modified on February 21, 2023 7:59 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…