అప‌న‌మ్మ‌కం ఏపీలో ఏ పార్టీని ముంచేస్తుందో ?

ఏ రాజ‌కీయ పార్టీకైనా నాయ‌కులు చాలా ముఖ్యం క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్.. కీల‌క నేత‌ల స‌హ‌కారం.. లేక‌పోతే .. ఏ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కిన ప‌రిస్థితి లేదు. అందుకే.. పార్టీ ఏదైనా కూడా నాయ‌కుల విష‌యంలో ఒకింత ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇది గ‌తంలో ఉండేది. పార్టీలు నేత‌ల‌పై భారం వేచి ఊరుకునేవి. త‌మ ప‌ని తాము చేసుకునిపోయేవి. నిర్ణ‌యాలు తీసుకుని వ‌దిలేయ‌డం మిన‌హా.. నేత‌ల‌పై పెద్ద‌గా ఒత్తిడి తెచ్చిన సంద‌ర్భాలు లేవు.

కానీ, ఇటీవ‌ల కాలంలో ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయి. అధికార‌, ప్ర‌తిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా.. టీడీపీ, వైసీపీల్లో నాయ‌కుల‌పై అప‌న‌మ్మ‌కం పెరుగుతోంది. ఏమో ఏం చేస్తారో.. అనే బెంగ పార్టీల అధినేత‌ల‌ను ప‌ట్టిపీడిస్తోంది. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేదేని.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు చేయ‌డం లేద‌ని.. పార్టీని పురోగ‌తిలోకి తీసుకువెళ్ల‌డం లేద‌ని.. ఇలా కార‌ణాలు ఏవైనా కూడా పార్టీల్లో నాయ‌కుల‌పై అప‌న‌మ్మ‌కం పెరిగింది.

ఇది .. ఆయా పార్టీల‌కు మేలు చేస్తుందా? అంటే కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నాయ‌కులు ఆత్మ విశ్వాసంతో ఉంటేనే పార్టీలు పుంజుకుంటాయ‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీని తీసుకుంటే.. త‌మ‌కు ఏమాత్రం స్వేచ్ఛ లేద‌ని నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. తాము చెప్పింది విన‌డ‌మే త‌ప్ప‌..మీరు ఏమీ మాట్లాడొద్దు అన్న విధంగా వైసీపీ అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇది.. పార్టీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు.

అయితే ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో నాయ‌కులు కొన‌సాగుతున్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌చ్చినా.. సేమ్ టు సేమ్. నేత‌ల‌ను స‌రైన దిశ‌గా న‌డిపించేస్తున్నాన‌ని.. తాను చెప్పిందే వినాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌నో భావాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఇటు టీడీపీపైనా నేత‌ల‌కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ పార్టికి దూర‌మ‌య్యారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. పార్టీల‌కు అప‌న‌మ్మ‌కం మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.