మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మోదీ కాళ్ళు కడిగి తాగాలని ఉందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బెర్రీ హాట్ కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.

సినీమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో సైతం ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. బెర్రీ కామెంట్స్ ను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులను కోట్లాదిమంది పూజించే దేవుళ్ళతో పోల్చడం సమర్ధనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సుదేష్ గురించి గూగుల్లో సెర్చ్…

దక్షిణాదికి సుదేష్ బెర్రీ పెద్దగా పరిచయం లేడు. పంజాబీ కుటుంబానికి చెందిన సుదేష్ ను బుల్లి తెర అమితాబచ్చన్ గా పిలుస్తుంటారు. 50 సినిమాల్లో నటించిన బెర్రీ టీవీ పరిశ్రమలో బాగా ఫాలోయింగ్ వుంది. తొలి రోజుల్లో హీరోగా చేసినప్పటికి ఆ తర్వాత కేరక్టేర్ ఆర్టిస్ట్ గా స్థిర పడ్డాడు. బోర్డర్, ఎల్ఓసీ కార్గిల్ వంటి దేశభక్తి సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఒక్క ప్రకటనతో దేశం మొత్తం చర్చకు కారకుడయ్యాడు.