Political News

తాజా వికెట్ – మాగుంట అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ దక్షిణాది వైపు వేగవంతమైంది. సౌత్ గ్రూపుపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అరెస్టుల పర్వం కొనసాగిస్తూ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల పంజాబ్ కు చెందిన ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ.. అతనిచ్చిన సమాచారం ఆధారంగానే నిన్న రాఘవరెడ్డిని విచారణకు పిలించింది సాయంత్రం అదుపులోకి తీసుకుని ఇవాళ అరెస్టు ప్రకటించింది.

రెండో రౌండ్ అరెస్టుల్లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్టు చేశారు. రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక సంస్థ ఒకరిని అరెస్టు చేస్తే మరో సంస్థ మరో సంస్థ వేరొకరిని టార్గెట్ చేస్తూ కొత్త విషయాలను బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఈడీ రెండు చార్జ్ షీటులు దాఖలు చేసింది. సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి 160 సీఆర్పీసీ కింద కవితను ప్రశ్నించి వెళ్లారు. త్వరలో 41ఏ సీఆర్పీసీ కింద ప్రశ్నిస్తారని చెబుతున్నారు. 41ఏ అంటే ఇక నిందితురాలిగా చేర్చినట్లేనని భావించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి అందించే సమాచారం ఆధారంగా కవితపై చర్యలుంటాయని చెబుతున్నారు.

ఇక సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు సమాచారం. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నుంచి పెద్ద వాళ్లను కూడా ఈడీ అధికారులు విచారిస్తారనడంలో సందేహం లేదు. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

This post was last modified on February 11, 2023 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

39 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago